పుట:Gurujadalu.pdf/580

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చి, సారధి నాయడికీ, ఇంకా మరి కొందరు నాయలకూ, చక్రాంకితం చేసి, వైష్ణవవిఁచ్చారు. ఆనాడు మునసబు రామినాయడు రామస్వామి వారి ఆలయంలో తూంపట్టు పుళిహోరా, వైష్ణవమూ యేక కాలమందే గ్రహించాడు. నాటికీ నేటికీ, రెంటియందూ ప్రపత్తి యేకరీతిగానే వుంది. అప్పటి నుంచి సారధి నాయడు ద్వాదశి ద్వాదశికీ స్వాం వారికి విరివిగా రాగ భోగాలు నడిపిస్తున్నాడు. ద్వాదశి అంటే రామినాయడికి పెద్ద పండుగ.

నాయళ్ళంతా వైష్ణవం పుచ్చుకొని, శివకోవిల వైపు తిరిగి చూడకపోవడం, శరభయ్యకు కంట్లో మిరపకాయ రాసుకున్నట్టు వుండెను. ఆలోచించి, ఆలోచించి ఒక యెత్తు యెత్తాడు.

ఆ రోజుల్లో హైదరాబాదు రాజ్యం నుంచి శివాచార్లు కొందరు దేశ శంచారార్థం యీ ప్రాంతానికి వచ్చారు. మరి రెణ్ణెల్లనాటికి పీఠంతోనూ, ప్రభలతోనూ, రుంజలతోనూ, పెను ప్రళయంగా వచ్చి యిక్కడికి దిగబడ్డారు. రోజూ అర్ధరాత్రి వేళ శివార్చన చేసేవారు. ఆ సమయంలో శంఖాలు, జయఘంటలు, ఢమామీలు, వీటి ధ్వని పామరుల మనస్సులో భయోత్పాతం పుట్టించేది. యీ నల్లరాతి కొండల్లో ఆ ధ్వనులకు ప్రతి ధ్వనులు కలిగి, కోలాహలంగా వుండేది. యీ అట్టహాసంతో, వైష్ణవం పుచ్చుకున్న ఒక్కొక్క నాయడే, నామాలకి నామంబెట్టి, విఫూది రుద్రాక్ష ధారణం చెయ్యడం ఆరంభించాడు. వచ్చిన పదో రోజున శివాచార్లు గుండం దొక్కడానికిపెద్ద ప్రయత్నాలు చేశారు. సారధి నాయణ్ణి కదిలించడవేఁ వాళ్ళ ముఖ్య ప్రయత్నంగా వుండెను. అదివరకే సారధినాయడికి శివమతం వేపు తూగు లావాయెను. గుండం తొక్కడం చూసిన తరవాత సారధినాయడు సిద్ధాంతంగా శైవం పుచ్చుగుంటాడని అంతా నమ్మారు. అందుచేతనే, శైవుల్లో మొనగాళ్ళంతా రుంజలతో సారధి నాయడి యింటికి వెళ్ళి, చాలా కైవాదం చేసి వుత్సవం చూచుటకు రాక తీరదని పిలిచారు.

యీ మాట చెప్పగా, అయ్యవార్లంగారు యేవఁన్నారంటే “రాముడి ఆజ్ఞ యేలా వుంటే, ఆలా జరుగు గాక. వైష్ణవుడు, శైవుడు కావాలని కోరితే, అడ్డి యేమి కార్యం? కాక కాశీలో మృతి పొందిన వారికి శివుడేకదా, తారక మంత్రోపదేశం చేస్తాడు. గనక యీ జన్మంలో పరమ శైవుడైన వాడికి, వచ్చే జన్మలో తారక మంత్రోపదేశం చేసి, ముక్తి యివ్వకపోతాడా? యే మతవైనా ప్రపత్తి వున్నవాడికి తోవ వుంది. అది లేకుంటే వైష్ణవుడైనా, కార్యం లేదు”. సాతాన్లకి అయ్యవార్లం గారి ఉదాసీనత చేయి విరుచుకున్నట్టు వుండెను.

ఈ బ్రాహ్మడికి వైష్ణవాభిమానం తక్కువ. గనక మనం విజృంభిస్తేనే కాని వైష్ణవమత ప్రభావానికి అగౌరవం వస్తుందని మనవాళ్ళయ్య ప్రగల్భించి, శివాచార్లు గుండం దొక్కేనాటి రాత్రి రెండు రూములప్పుడు, కోవిల యెదటి రావి చెట్టు కింద పెద్ద మీటింగు చేశాడు. సాతాన్లూ, నాయలూ వొందలకి జమ అయినారు. అందులో యోధులు, దుకాణంలో రహస్య

గురుజాడలు

535

మీ పేరిమిటి?