పుట:Gurujadalu.pdf/578

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవును తాము శెలవిచ్చినట్టు పామరులకు వుండే గాఢభక్తి పండితులకు వుండదు గాని, యీ మూఢభక్తి ఒకప్పుడు ప్రాణాంతం తెస్తుంది - అదే చెప్పబోవుచున్నాను వినండి.

“నేను ఆ మాటే చెప్పబోతే చెప్పనిచ్చాడు కాడు” అని వెంకయ్య అన్నాడు. “అవును నీకంటూ తెలియని సంగతి లేదు. మరి వూరుకో” అన్నాను.

శివస్థలం యొక్క ఉత్పత్తి మీకు తెలియనే తెలుసును. పూజారి శరభయ్య చాలా కథకు డౌటచేతను వీడి రోజుల్లో శివస్థలానికి మిక్కిలిగా వైభవం కలిగింది. చుట్టు పట్ల గ్రామాల వాళ్ళందరూ మొక్కుబళ్ళు చెల్లిస్తారు. ఉత్సవపు రోజులలో పెద్ద జాతర్లు సాగుతాయి. మరిన్నీ యిక్కడి దేవాంగులు కలిగినవాళ్ళు. జంగంపాడు యావత్తున్నూ, దేవర పేటానున్నూ, శరభయ్య మాట మీద నడుస్తారు. ఈ గ్రామములో వుండే విష్ణుస్థలం రెండు వందల యేళ్ళ కిందట యీ దేశం యేలే ఒక మహారాజు కట్టించి రాజభోగాలకు వొక గ్రామం స్వామికి సమర్పణ చేశారు. అప్పటి నుంచి రంగాచార్యులు గారి కుటుంబస్టులే యీ స్థలానికి ధర్మకర్తలై వుంటూ వచ్చారు. యీయన యిద్దరు ముగ్గురు వైష్ణవులను జీతమిఁచ్చి వుంచి వాళ్ళ చేత మిక్కిలి భక్తి శ్రద్దలతో స్వాంవారి కైంకర్యం జరిపిస్తూన్నారు. రంగాచార్యులు గారు బహు యోగ్యులు. ఆయన యొక్క సంస్కృత సాహిత్యం మీరు చూడనేచూశారు. ద్రావిడ వేదములో కూడా గట్టివారని ప్రతీతి కద్దు. ఆయన కొమాళ్ళు క్రిష్ణమాచార్యులు కూడ సంస్కారే గాని విశేష ప్రయోజకుడు కాడు. ఆ యింటికి వెలుగు తెచ్చినది యీ కృష్ణమాచార్యులు భార్య నాంచారమ్మ. ఆమె తల్లీ తండ్రి కూడా పండితులౌట చేత ఆంధ్ర గీర్వాణముల యందు మంచి జ్ఞానం సంపాదించిరి. పురాణం ఆ యిల్లాలు చదివినంత శ్రావ్యంగానూ, రసంతోనూ యెవరూ చదవజాల్రు. రూపమూ రూపానికి సదృశమైన గుణ సంపత్తీ కలదు. ఆమెకు ఒక కొమార్తె. ఒక కొమారుడున్నూ. యిల్లూ, దేవాలయం కూడా ఆమే చక్కబెట్టుకుంటారు.

“ఇది కవిత్వమా, నిజమా?” అని వెంకయ్య అడిగాడు.

మాకూ వాళ్ళకూ రాకపోకలు గలవు. నా భార్య చెప్పిన మాటలు నే చెబుతున్నాను. ఆమె పురాణం చదవడం చవులారా విన్నాను. మీకూ వినడపు అభిలాష వుంటే రేపటి దాకా వుండిపొండి. విష్ణుస్థలం యొక్క స్థితి ఇది. గాని, అయ్యంవార్లం గారు మత సంబంధమైన జట్టీలలో యెన్నడూ జోక్యం కలుగజేసుకోవడం లేదు. వైష్ణవ పక్షానికి కెప్తాను సాతాని మనవాళయ్య, అనగా రోజూ పొద్దున్న ఉపాదానానకు వచ్చి, స్తోత్ర పాఠాలతో పెణక యెగర గొట్టేస్తాడే, అతగాడే ఒకనాడు తెల్లవారగట్ల కలక్టరు గారు గుఱ్ఱమెక్కి వస్తూ వుండగా, గ్రామ పొలిమేరను మనవాళ్లయ్య యెదురై, పెళపెళమని శ్లోకం యెత్తుబడి చేసేసరికి, ఇతని స్థూలకాయం బఱ్ఱె నామాలు, రాగి ధ్వజం, కోలాహలమూ చూసి గుఱ్ఱం బెదిరింది. కోపం వొచ్చి కలక్టరు

గురుజాడలు

533

మీ పేరిమిటి?