శెట్టి : బుద్ధి తక్కువకు లెంపలాయించుకుని బేగెళ్లి కథ యెలా వుందో కనిపెట్టండి.
కొండు : సరేగాని ప్రొద్దుపోతూంది. నువ్వు ముందు వెళ్ళి పెరటి గుమ్మం దగ్గర వుండు. నే నిప్పుడే ఆ బోడి పంతులిని బసకు దిగబెట్టి వచ్చి కలుసుకుంటాను... (త్రివిక్రమరావు పంతులుగారి వద్దకు వెళ్ళి) ప్రభువు వారు దయచెయ్యాలి... యేదిరా గుర్రబ్బండీ. తీసుకురా జట్కా! ప్రభువువారి హోదాకి తగినది కాదు కాని - కుచేలుడింటికి శ్రీకృష్ణమూర్తి వారు విజయం చేసినట్టు అనుగ్రహించాలి... సాయిబూ, మా బసకి పోనీయి. ఈ సామాను పట్టించుకుని నౌకర్లతో కూడా నేను వస్తాను.
వెంకటస్వామి : నా గాజు సామానుకు వేరే బండి కావాలి.
కొండు : ఈ బండీ నీకు.
అచ్చన్న: నా లాంతరుకి కొవ్వొత్తులకి వేరే బండీ కావాలి.
కొండు : ఈ బండీ నీకు
అల్లిఖాన్ : పంతులుగారి హుక్కాకీ, లేహం డబ్బాకీ వేరే బండీ కావాలి.
కొండు : ఈ బండి నీకు.
అల్లీ: పంతులుగారి పోషక్కు వేరేబండి కావాలి.
కొండు : దానికీ బండి.
బుచ్చన్న: వంట సామానుకో బండి కావాలి.
పాపన్న : ప్రత్యేకం నాకొకబండి మామూలు.
కొండు : మరిలేవు పొండి.
పాప : స్నేహితుణ్ణి, ఆశ్రితుణ్ణి -
కొండు : మరిలేవుబళ్లు, ఒక్కొక్కరే ఓ బండీ యెక్కి వాళ్లు వుడాయించారు.
బుచ్చ : అయితే యీవాళ పంతులుగారు పస్తు పడుకోవాలీ....
కొండు : నడిచి వెళ్ళిపోదాం - మరి బళ్లు దొరకవు.
బుచ్చ : సామానెవడు మోస్తాడు.
కొండు : కూలివాడు ఒకడూ కనపడ్డూ - మనమే మోసుకుపోవాలి.
పాప : మనం - తిమ్మనం - ఆ పప్పుడకదు. నేను ఒక్క వస్తువయినా పట్టుకోను.
బుచ్చ : దొబ్బితిని, భంగుతాగి పంతులుతో మజా ఉడాయించడాన్కి నువ్వున్ను, అరవచాకిరీ చెయ్యడాన్కి నేనూనా!
గురుజాడలు
487
కొండుభొట్టీయము