Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51

ఉపాగ్రాసనాధిపతులు, — చిలకమర్తి లక్ష్మీనరసింహము గారు, నూరి నరసింహము గారు.

కార్యదర్శులు,—నాళం కృష్ణారావుగారు, అయ్యంకి వేంకటరమణయ్య గారు.

ఇతర సభ్యులు

రొయ్యూరు రామచంద్రప్రసాదరావు గారు, రొయ్యూరు.
గోపరాజు బ్రహ్మానందంగారు, బెజవాడ.
బొడ్డపాటి శేషగిరి రావుగారు, పొద్దుటూరు.
బొడ్డపాటి హనుమంతరావుగారు, బొడ్డపాడు,
బాలసరస్వతీ సంఘము, అంగలూరు.
వేమూరి రాంజీరావుగారు, మచిలీపట్నం.
కొడాలి శివరామకృష్ణారావుగారు, డిటొ
టి.యన్.శర్మగారు, ఉంగుటూరు.
నిడమర్తి లక్ష్మీనారాయణగారు, నిడమర్రు.
బెల్లంకొండ రాఘవరావుగారు, పమిడిపాడు. నర్సారావుపేట పోష్టు.
సత్తెనపల్లి హనుమంతరావుగారు, దుగ్గిరాల.
చట్టి నరసింహారావుగారు, గుంటూరు,
చలా శేషగిరిరావు గారు, గుంటూరు.
పులిపాక వెంకటరామారావుగారు,ఈమని.
అంచే శివయ్యగారు, ఈమని. తెనాలి తాలూకా.
కుప్పా శ్రీ రామశర్మ గారు, అనంతవరం. తెనాలి తాలూకా.
అద్దంకి సత్యనారాయణమూర్తి గారు, రాజమండ్రి.
రామానుజ పుస్తక భాండాగారము, తుని.
ఆకెళ్ళ వెంకట సుబ్బారాయుడు గారు, అమలాపురం.
పీపిల్సు ఎస్సోసియేషన్, కాకినాడ,
బిక్కని వెంకటరత్నంగారు, చోడవరం. రామచంద్రపురం తా.
భాగి సుబ్రహ్మణ్యం గారు, సికింద్రాబాదు.
ఇ. సుబ్బుకృష్ణయ్య గారు, హైదరాబాదు.
చివుకుల అప్పయ్యశాస్త్రి గారు, సికింద్రాబాదు.
యస్. నగరాజారావు గారు, జానోదయ సమాజం. నెల్లూరు.
తిక్కన పుస్తక భాండాగారము, డిటో
రామమోహన ధర్మపుస్తక భాండాగారము, గండివరం,
కడవలూరు పొష్టు, నెల్లూరుజిల్లా.
పొణకా పట్టాభిరామరెడ్డి గారు, పొట్లపూడి,
మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు, విశాఖపట్నము.
కే. జోగారావుగారు, ఎలమంచిలి.
ఆంధ్రభాషాభివర్ధనీ సంఘము, బరంపురం.
తిత్తి బలరామయ్యగారు, బారువ,
డి.కృష్ణారావుగారు, బరంపురం.
ఆంధ్రభాషాభి వర్ధనీ సంఘము, పొద్దుటూరు, కడపజిల్లా.
రామకృష్ణ పరమహంస రీడింగురూమ్, కడప,
దేశపాండ్య సుబ్బారావుగారు, నంద్యాల.
మిత్రమండలి, బళ్ళారి.

9వ తీర్మానము.

తెనాలి తాలూకా దుగ్గిరాల భాషాభిలాషిణీ సంఘమునకు భవనమును నిర్మించుచున్న పునాదిపాటి గ్రామవాస్తవ్యులును ఉదార స్వభావులునుగు, యేర్లగడ్డ పెన్నీడు చౌదరి గారి కీ సభ వారు వందనము లర్పించుచున్నారు. ఇట్లే ఆంధ్రదేశములోని జమీందారులును ధనవంతులును గ్రంధాలయోద్యమమునకు సహాయమును జేయుదురని ప్రార్ధించుచున్నారము.

10వ తీర్మానము.

ముందు సంవత్సరమీ సభను నెల్లూరు జిల్లాయందు చేయుటకు తీర్మానింపడమైనది. ఈతీర్మానమును పొట్లపూడి వాస్తవ్యులగు పొణకా పట్టాభిరామ రెడ్డి గారు ఉపపాదించిరి. నెల్లూరు వాస్తవ్యులగు యన్.నాగరాజారావుగారు బలపరచిరి.

తదుపరి అగ్రాసనాధిపతిగారు తమ యంత్యోపన్యాసమును ముగించిన పిమ్మట, కొవ్యూరు వాస్తవ్యులగు తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులుగారు అగ్రాసనాధిపతి గారికిని, ప్రతినిధులకును వందనము లర్పించిరి. అంతటితో సభ ముగిసెను,