Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

కీసభవారు వారి కుటుంబములకు తమ సానుభూతిని దెలుపుచున్నారు.

అగ్రాసనాధిపతి గారిచే నుపపాదింపబడినది.

2.వ తీర్మానము.

విద్యాభివృద్ధి చేయుటయందు గ్రంధాలయములు ముఖ్యస్థానములు గనుక (ఏ) ప్రస్తుతము ఆంధ్రదేశమున స్థాపింపబడియున్న గ్రంథాలయములకును, పఠన మందిరములకును, మ్యునిసిపాలిటీ, డిస్ట్రిక్టు తాలూకా బోర్డుల యొక్క ద్రవ్యములనుండియు, ప్రొవి౯షియల్ రివిన్యూలనుండియు ద్రవ్యసహాయమును జేయుటకు సదుపాయములను గలుగ జేయవలసినదని ప్రభుత్వము వారిని ఈ సభ వారు ప్రాథి౯ంచుచున్నారు. (బి) ఆంధ్రదేశమధ్యమున అనుకూలమైన స్థలమునందు, ఆంధ్రభాషయందు ప్రచురింపబడు గ్రంథములనన్నిటిని పత్రికలనన్నిటిని చెన్నపట్టణ ప్రాచ్యలీఖితపుస్తక భాండాగారమందలి ఇతర అముద్రిత గ్రంధప్రతుల నన్నిటిని జేర్చి ఆంధ్రదేశ మందలి ఇతర గ్రంధాలయములకు సహాయభూతముగ నుండునటుల గ్రంధాలయము నొకదానిని ప్రభుత్వమువారు నెలకొల్పుట ఆత్యావశ్యకము గనుక అట్టి గ్రంథాలయమును త్వరలో స్థాపించుటకు ప్రభుత్వమువారిని ఈ సభవారు ప్రాథి౯ంచుచున్నారు.

ఈ తీర్మానమును హానరబిల్ రావు బహద్దరు మోచర్ల రామచంద్రరావు పంతులుగారు ఉపపాదించిరి. ఒంగోలు పురవాసులగు మిట్టదొడ్డి సుబ్బారావు పంతులుగారు బలపరచిరి.

3వ తీర్మానము.

దొరతనము వారిచే ప్రచురింపబడు పరిశ్రామిక ఆరోగ్యవిషయిక ప్రచురణముల నన్నిటిని, జిల్లా గెజిటీలను, ఆంధ్రభాషయందు ముద్రింపబడిన గ్రంథముల పట్టికలను ఆంధ్రదేశమునందలి గ్రంధాలయముల కన్నిటికిని ఉచితముగా దయచేయవలెనని ఈసభ వారు ప్రభుత్వము వారిని ప్రాథి౯ంచుచున్నారు.

4.వ తీర్మానము.

ఆంధ్ర దేశమునందంతటను గ్రంధాలయోద్యమమును వ్యాపింపజేయుటకై సంచార కార్యదర్శి నేర్పాటుజేయుటకు కావలసిన ద్రవ్యమును సమకూర్చుటకు అందఱును సహాయపడెదరని ఈ సభవారు జనులనందఱిని ప్రాథి౯ంచుచున్నారు.

5వ తీర్మానము.

ఆంధ్రదేశమునందున్న అన్ని పట్టణములయందును పల్లెల యందునుగూడ గ్రంథాలయములను గాని పఠనమందిరములను గాని స్థాపింపవలెనని జనులనీ సభవారు ప్రాధి౯ంచుచున్నారు.

6వ తీర్మానము.

ప్రతి గ్రంథాలయమును తాము గత సంవత్సరమునందు చేసిన పనిని నివేదించుటకును, ముందు చేయబూనుకొన్న పనిని గూర్చి ప్రస్తావన చేయుటకును, జనసామావ్యమునకు సంఘాద్దేశ్యములను తెలియజేయుటకును గాను సంవత్సరోత్సవములను జరుపుటకును ఆసమయమున జదువబడిన కార్యనివేదనమును ఈ సంఘపక్షమున బ్రకటించు పత్రికలో ప్రకటించుటకు గాను కార్యదర్శులకు బంపుటకును గ్రంథాలయ సంఘములను ఈసభవారు గోరుచున్నారు.

7వ తీర్మానము.

తినిధుల కట్నముల వలన వసూలు అయిన సొమ్మును సంచార కార్యదర్శియొక్క ఖర్చుల కొఱకును ఇతర ఖర్చులకొఱకును ఈ సభవారిచే నేర్పరుపబడిన గ్రంథాలయ సంఘమునకు ఇచ్చుటకు ఈ సభవారు తీర్మానించుచున్నారు.

8వ తీర్మానము.

ఆంధ్రదేశ గ్రంధ భాండాగార సంఘమునకు ఈ సంవత్సరమున నీదిగువ నుదహరింపబడినవారు కార్యనిర్వాహక సభ్యులుగ నెన్ను కొనబడిరి.

అగ్రాసనాధిపతి,—— గౌ.మోచర్ల రామచంద్రరావుగారు.