Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

34

రి యింటనే గలదని యాతడు తృప్తి జెందుచుం డెను; తర్వాత స్వయంకృషిచే మిక్కిలి ధనవంతుడైనప్పుడు సహితము తన యభిప్రాయమును మార్చుకొనజాలనని కార్నీ జీ నుడివియున్నాడు. ఈప్రకారము బాయిలకు వద్ద ఒక సంవత్సర కాలము పనిచేసి ఓహియో టెలిగ్రా ఫు కచ్చేరీలో తంత్రీ వాత౯లను బట్వాడా చేయు కుర్ర వాడుగా ప్రవేశించెను. అచ్చటనున్న కాలములో టెలి గ్రాఫు పనులను దెలిసికొని శీఘ్రకాలములో నెలకు ము ప్పది రూపాయిల జీతము సంపాదింపగల టెలిగ్రాఫు ఉద్యోగమును రైలు స్టేష నునందు సంపాదింప గలిగెను. ఆజీతమునకు అతడు చాల సంతృప్తినిజెంది యానందము ను బొందుచుండెడివాడు, అప్పుడు తన తండ్రియొక్క గృహమును తాకట్టుబెట్టి ఆదామ్సు యక్స్ప్రెస్సు కం పెనీలో 10 భాగములను కొనెను. వ్యాపార ప్రారంభ మున కిదియే కార్నీ జీ యొక్క ప్రధమ ప్రయత్నము. అనుభవశాలియగుటచేత నావ్యాపారములో భాగములు కొనినచో లాభము రాగలదని ఊహింపగలిగెను. దూర దృష్టితో నాలోచించి తనవద్ద సొమ్ము లేనప్పటికి నప్పు చేసి వ్యాపారమున జొరబడెను. సాహసములేని దెట్టి స్వల్ప కార్యమైనను సాధింపజాలముగదా.

రైలు కంపెనీవారు కార్నీ జీయొక్క తెలివి తేట లను గని పెట్టి వెంటనే పిట్సుబర్లు డివిజనునకు సూపరిం టెండెంటుపని నిచ్చిరి. ఆకాలమున అమెరికాలో జరిగి న దేశీయ యుద్ధమునందు మిలిటరీ రైలురోడ్డును టెలి గ్రాఫులను కాపాడుటకు కార్నీజీ నియమింపబడెను. యుద్ధమును ప్రత్యక్షముగ సందర్శించుట కవకాశము క లిగి యందలి ఘోరము లాతని మనసునకు దృఢముగ నా టుటచేత నిప్పటికిని యుద్ధవాత యతనికి కణకఠో రముగ నుండును.

ఆయుద్ధకాలమున కార్నీ జీ వాషింగ్టనులో పనిచే సి తిరిగి పిట్సుబర్లునకు రాగా, నిద్రకనుగుణ్యమైన రైలు బండ్లనుక నుగొనిన ‘వుడురపు' అను వానితోకలసి భాగస్థు డుగ జేరి బ్యాంకిలో కొంతసొమ్మును బుణము తెచ్చి ఁ పె నిసీ ర్వేనియా ' రోడ్డుమీదకూడతమబండ్ల నేవాడుక లోనికి రప్పించగలిగెను. ఆడమ్సు కంపెనీకంటే ఈకం పెనీలో కార్నీజీ కెక్కువ లాభము గలిగెను.

1861 సంవత్సరములో పెన్సిల్వేనియాలో కనిపె ట్టబడిన కిరసనాయిలు వ్యాపారమునకై తానప్పటికి నిల వజేసిన 8000 నవరసులను వినియోగించి యానూనె దొర కుక్షేత్రము నొకదానిని కొనెను. కార్నీజీ యదృష్ట మంతయు అతని నప్పటినుండి యుచ్ఛస్థితికి దెచ్చినది. ఇనుప వ్యాపారములు జేయు అనేక కంపెనీలలో భాగ స్థుడై 1868 సంవత్సరములో ఆంగ్లేయదేశములో ప్రశ స్త మైన బెస్మరు ఉక్కు తయారు చేయుపద్ధతిని పరిశీలిం చుటకై పోయియుండి అమెరికాకు వచ్చినపిమ్మట, ఉ క్కురైళ్ళను తయారుచేయుటకు యంత్రశాలలను స్థా పించెను. రైళ్ళకు కావలసిన యినుపసామగ్రిని తా తయారుచేయించవలెనని దీక్ష వహించి కార్నీ జే ఉక్కు యంత్రశాలలను స్థాపించియుండెను. తన పట్టుదల ప్రకా రము తన పనులకు కావలసిన సామానులనన్నిటిని తన యంత్రశాలలోనే తయారుచేయగలిగి యితరుల పై యా ధారపడి యుండనందులకు కార్నీ జీపొందిన యానంద మును మనమూహింపజాలము. 1883 సంవత్సరములో మరియొక ఉక్కు యంత్రశాల కధికారియయ్యెను. కా ర్నీ జీ ఉక్కు యంత్రశాలల కంపెనీ పేరబరగు వ్యాపార ములందు 50 లక్షల నవరసులను మూలధనముగా కార్నీ యుంచగలిగెను. 1892 వ సంవత్సరములో బొగ్గు నుని కంపెనీ నొకదానిని సంపాదించెను. 1900 సంవ త్సరము నాటికి తన కంపెనీలలో మూలధనము కోటిన్న ర నవరసులుగు జేసెను. తనకు 62 సంవత్సరముల వయసు వచ్చుసరికే కార్నీ జీ వ్యాపారములనుండి చాలించుకొని 50 కోట్ల నవరసుల స్థితితో తులతూగుచుండెను.

కార్నీజీ యీవిధముగ లాభమును సంపాదించగ లుగుటకు ముఖ్యకారణము, వ్యాపారములో పనిచేయు వారికి తన లాభములో కొంతపాలు పంచియిచ్చుటయ ని బోధించుచున్నాడు. మరియొక రహస్యమేమనగా తెలివిగలవా డెచ్చటకన్పించినను వానిని తగువిధముగా ప్రోత్సాహపరచి లాభములో భాగమునిచ్చి తనవ్యాపా రములో చేర్చుకొనుచుండెడివాడు. ఎవరైన భాగస్తుడు కాలము చేసినయేడల నెల దినములలో వాని వారసులకు (.