Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82


బాల్యమునఁదన్ను రమణ సౌభాగ్యకలిత
యనిన సాముద్రికులమాట లరసి తిట్టు.

ఆని ఉన్మాద విరహము ననుభవించినది. ఇది యింకను ప్రద్యుమ్న సహవాసముఖమబ్బకమునుపే, మనవరూధిని యన్ననో 'విసివివినివితనువుదొఱఁగ' దలచినది. విరహ దశలయందు వరూధిని యపస్మారము ఆమె స్వభావస్నిగ్ధతను సహస్రముఖములతోఁ బాడుచున్నది.

'సగము గొఱికినయాకును, సఖులు పిలువ
సగమొసగునుత్తరము, తెల్వి సగము, మఱపు
సగము, నయి చింతచే సగమగుచు నరిగె.”

ఈ నాయిక యొక్క ప్రేమాదర్శనమును చక్కగా గుర్తించుటకుఁ గొన్ని యవకాశము లున్నవి.

'నానోముల్ ఫలియించె, నావయసుధన్యంబయ్యె విప్రోత్తమా'?

అను వాక్యములె యామె యాదర్శమునకు మాత్రములు, బాల్యయౌవన కౌమారాదికములగు దశలు నాలుగు అందొక్కటొక్కటి 'ధన్య'ము గావలయునని యామె యాశయము. బాల్యమునఁ రంభాది సఖీసాహచర్యమబ్బినది. వెన్నతో ననవిల్తుమినుకులావర్తించినది. ఇక జవ్వన మాముకొనినది. 'మానంజాల'నను ప్రియసల్లాపము చేనదియు ‘ధన్య'మైనట్లు ఆనందించుచున్నది. కవియు నెడఁగన్నుమూయొ'ట కొప్పుకొనిన నాయికా భావదైన్యమత్యంత కరుణము. రసోపపత్తి యిందొదుగు నవకాశములు లేవు. ఆనందో బ్రహ్మ' మున్నగు సాంప్రదాయకములు తడవిన యీనాయికకు విమర్శకుఁడు వైష్ణవమత స్పర్శను సూచింపకపోఁడు, ఇంకొకమాఱు 'మనోరమ'ను దిలకింతము.

రాయప్రోలు సుబ్బారావు


పుస్తకా వాహన

సీ.

నిండాఱఁ బాఱు నఖండ గోదావరి
దాగిన చాళుక్య నాగరికత,
పాడైన పెనుకోటగోడల దీర్ఘని
ద్రలువోవు కాకతి ప్రాభవమ్ము,
పల్లెపదాల జీవమునిల్పి కొన్న ప
ల్నాటివీరుల రక్తనాళ పటిమ,
కడలేక యేళ్చు తుంగాభద్ర కెరటాల
మణఁగిన పూజ్య సామ్రాజ్యభరము


తే.గీ.

హృదయములువిన పలుకక చదువు జెప్పు
పుస్తకతపస్విని తెలుంగు పూలపొదల
నిలచి సేవాశుకమ్ములఁ బిలచిపిలచి
స్థిరత పాడించుగాత జాతీయగీతి.


సీ.

ఆచారమునకు దాస్యముఁ జేయుచునువంట
యిల్లు దాటఁగ లేనియిందుముఖుల,
ఉదయాస్తమయములు మెడలి చెమటఁ దీసి
క్షేత్ర సేవలు జేయు సేద్యగాండ్ర,
బ్రతికినన్నాళ్ళు తీఱనికస్తి, రెక్కలు
విఱిచి జీవించెడు పేదజనుల,
అక్షరపంక్తులె యరయ రాదనుచు, దు
ర్గతులఁద్రోసిన చెప్పరానివాండ్ర,


తే.గీ.

పూలతో నిండి కమ్మదనాలు చిమ్ము
పుస్తకానికుంజ పుంజాళి పొంతఁబిలచి
‘నాజనము, నాదు దేశ' మనంగఁజాలు
ఇంతజ్ఞాన భిక్షాదానమిమ్ము తల్లి!


సీ.

ఆంధ్రులశిల్ప విన్యాసంబు చూపించు
కలిమిగోపురములగలదటంచు,
ఆంధ్రనాగరిక కళ్యాణచిహ్న ములైన
గాన సాహిత్యముల్ గలవటంచు,