Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

83

83 1 1 ఆంధ్రభాగ్యము మోయగ గౌతమి కృష్ణ దరులను నావలు దిరిగెననచు, ఆంధ్రవీరులకు స్వర్గాతిథ్యమిచ్చి పా టలుపాడిన యుగముకలదటంచు, తే.గీ. చెప్పి యొప్పించు పుస్తక శ్రీకుమారి యందగింపఁగఁగల యాలయములుగట్టుఁ డాంధ్రదేశమునందెల్ల నాంధ్రపుత్రు లా ప్తమానవసంఘ సేవానురక్తి. రాయప్రోలు సుబ్బారావు. ఆంధ్రము నందనుస్వారము పురాణమి త్యె వనసాధుసర్వం | నచాపి కావ్యం నవ మిత్యవద్యం | సన్తః పరీక్ష్యాన్య తరద్భజన్తె | మూఢ పరప్రత్య య నేయబుద్ధిః॥ యని అభయుక్తోకి కలదు. ప్రాచీనులు చెప్పిన మాత్రాన సాధువనియు, నవీనులు చెప్పిన మాత్రాన నసాధువనియు నెంచక గుణాగుణ వి చారణచేసి సత్పురుషులు గ్రహింతురనియు నట్లు కాకుం డుట మూర్ఖ పద్ధతీయనియు దీని భావము. బాలాదపి ను భాషితమ్మను మాట యీయధనమునే దృఢపఱచుచు న్నది. ప్రియ పాఠకులారా, నేనీదృష్టితోనే త్రిలింగయ ను పత్రిక యందుండిన “ఆంధ్రము నందనుస్వార కలదా ” యను వ్యాసమును జదివితిని. అవ్యాసములో వక్తవ్యాం శమునకు ముందు గానుండు కొన్నిమాటల న్యాయదృష్టి లో నంగీకరించితిని. అవసరమైనను గాకపోయినను బ్రా చీనార్యులను సంస్కృత వ్యాకరణ రచయితలగు పాణి న్యాదులఁజేసిన స్తుతికి మిగుల సంతసించితిని. ఆంధ్ర వైయాకరణుల కేమి, ఆధునిక కేవల సంస్కృత వ్యాక రణాభిజులకేమి, కొంత యజాన మాగోపించినను వీరు చూపింపఁబోవు నపూర్వ విషయము గ్రహించుటకై సై చితిని. చివరకు నామతమిందు పైఁ దెలుపవలసిన యవస రము గన్పట్టినందున, నాపనికిఁ బూనితిని. वै ఆవ్యాసమెంత పొడుగుగ నుండినను దాని సారమి ది:_ “ఆంధ్రము నందను స్వారము లేదు. ఙ, ఞ, లున్నవి. అను స్వారమునకు కవర్గము పరమగుచో, 'జ' కారమును చ వర్గము పరమగుచో 'ఇ ' కారమును, ట వర్గము పర మగుచో'ణ' కారమును, త వర్గము పరమగులో 'నీ' కా రమును (ప్ర' వర్ణము పరమగుచో మ, కారమును స్వారస్థానమందు వ్రాయవలయును. ప, గజ్జి, కణ్ణ, కన్హ, చమ్బు యధాశ్రమముగా నుదాహరణములు, మా క్ష్మదృష్టితో విచారించిన నుచ్చారణ స్థానముల బట్టి, బోధ కాఁగలదు. పాణినీయములోని "నశ్చాపదాన్త స్య ఝలి,” “మోనుస్వారః," అను సూత్రములచే నిరనునా సీకలగు స్పశకాలు నూమ్మలు పరమగునపుడు ఆపదాన్త నకారమునకును పదాన్తమందుఁ గూడ మకారమునకును అను స్వారమువచ్చును. “అను స్వారస్యయయి పరసవ ర్ణః” అను సూత్రముచే నీయనుస్వారమునకు స్పళలు సంతస్థలములు పరనుగు నపుడు క్రమముగా ఙ, ఞ, ణ, న, మ, లగును. లక్ష్యములు, అజ్కితము, ఆఖ్చితము, కుణ్ణితము, శానము, గుమ్భితము అని వ్రాయుట సాధు వు గాని, అంకితము, అంచితము, కుంఠితము శాంతము, గుంభితము అనునవి యెట్లు సాధువులు గావో అట్లే పంగ, గంజి, కండ, కంత, చంబు అనునవి కూడ సాధువులు గావు.” " కాని సంస్కృతమున నింకొకటి విచారణీయాంశము గలదు. “హిపదా స్తస్యయను సూత్రముచే పదార్తమ గు ననుస్వారమునకు వర్గీయములు పరమైనచోఁ బరవసవ ర్ఘము కంసబ్జఘాన యనియు ననుస్వార ఘటితరూపము కంసంజఘాన యనునదియు సాధువే. కానీ సంస్కృత మును, తద్వైయాకరణులఁ బ్రమాణముగాఁ గొనిన మన ము “దృతంచ బిందుస్యాత్,” “ప్రధమా విభక్తి కమో ర్బిందుశ్చ” యను సూత్రములచే పదాన్త నకార మకా రములకు బిందువులను వచ్చెంగమలాక్షుఁడు భయంపడి యనువాని నొప్పుకొనవలయుఁ గదా. అట్లయిన నాంధ్ర