Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొంతసహకారముగ సహృదయులు 'రసపోషణ'మును సమర్థింపవచ్చును; నాకిచట కావలసినదియవస్థాంతర ప్రసక్తి మాత్రమె.

వరూధిని యాకారము

కవి రచించిన నాయిక పదములలో ఆమె యాకృతియు నణఁగియుండును. నాయికల కందఱకును సమానరీతిగల వర్ణనలనేకములు కలవు. అయినను ప్రతిభావంతుఁడగు సుకవి తననాయికకు 'విలక్షణతఁ గల్పింపకవిడువడు. పాత్రోచితీ నిరూపణమునందు ఈవిలక్షణత్వ చర్చ కవకాశమధికము. పెద్దన మహాకవి. ప్రకృతి విలాసమును చక్కగా గుర్తించిన రౌచికుఁడు. వరూధుని వంటి నాయికకు ఆకృతి స్వభావములందుఁ బరిస్ఫుటమగు నైలక్షణ్యమును బాటించి యుండకపోఁడు, వరూధిని సర్వాంగ సౌందర్యముగల నాయికయని భావవీధియందాలోకింతము. ఊహాప్రతిష్ఠితమగు బింబము నందేమోహనాంగము విలక్షణశోభతో రాణించుచున్నది? పెద్ద నార్యుఁడిచ్చిన వర్ణనలతోఁ జిత్రకారుఁడొక పటము వ్రాయుననుకొందము, అతడేయంగమునందుఁ గళాప్రాణమగు విలక్షణతను దిద్దవలెను? ఈ ప్రశ్నలకు మనుచరిత్ర వర్ణనలే ప్రత్యుత్తరము లియవలసియున్నవి. వరూధినీ సౌందర్యము నేత్రములయందుఁ బరమావధి నందినదని నాయూహ. ఇట్లంటినని యితరావయవములు యధాసుందరములుగా పొందుపొంకములందలేదని నాయాశయముకాదు. తీర్చిదిద్దిన చక్కదనాల రేకలలో నేది విలక్షణమయిన శోభను జూపుచున్నదని నాయర్ధము. ప్రవరాఖ్యునకు గానఁబడిన నాయికా మూర్తిని భావింతము. మొదట 'విద్యుల్లతా విగ్రహాయని విశేణముతో వరూధిని యాకృతిని మొత్తముమీద సూచించినాఁడు. తరువాత శతపత్రేక్షణయని పలికి నేత్రములకుఁ బ్రధాన సౌభాగ్యము నిచ్చినాఁడు. ఇదియె ఆమె నేత్రలావణ్యమునకుఁ బ్రధమ బీజము. పిదప కొంతసేపటికి వరూధినికి అబ్బురపాటు'దయించినది. ఆ యవస్థయందుఁ గూడ ప్రధమరాగము నయనాంబుజములు వికసించుట'తో నుదయించినట్లు జిత్రించుట కారంభించినాఁడు. అందు కాంతిపెల్లుబ్బినది. కనీనికలు' పూచిన కలువమాలలను గ్రుమ్మరించినవి. అనంతర దశయును కావ్యసౌందర్యమును దోహలించునదె. 'లేనడు మల్లలు నాడగా' పూచిన పోక బోదియచాటునకుఁ బోయినది. అందెలు రవళించినవి. అచటనుండి దృగంచల ప్రభాతరంగములు త్రోవయందు వెల్లువఁబెట్టినవి. అప్పటికి (ప్రఫుల్ల నేత్రమ్ములతో, యిక నాయకునిఁ జూచినది. అంతట పులకలు మేననం కురించినవి, ఆవాలకమునందు కన్నంగవ... ముఖచంద్రు నాక్రమించుకొనునో' యను భ్రమ మన్మధునకారోపించిన కవి రసాత్మకుఁడనుట నిర్వివాదము, ఇందును కన్నులయందమె పుష్పించుచున్నది. ఇంకను భ్రమరకీట న్యాయముననుకరించినపుడు గూడ నాయికకు మొట్టమొదటి మార్పు క్షేత్రాంచలములయందే పొలుపువారినది. బిత్తరచూపు అని మేవ స్థితిని మాన్చినది. ఇంతటితో నయనానందమాగలేదు. కవికి నాయికా కటాక్ష సౌభాగ్యమునందుఁగల యా సమమత యపారమైనదిగఁ దోఁచుచున్నది.

"చెలువగు వానిఁజూచినను
జెల్వకుఁజూపులఁగావె కూటముల్

అను రసరహస్య పక్షపాతముగూడ వరూధినీ సౌందర్య రాశియందు కటాక్ష కాంతి కదంబ ప్రాధాన్యము: సూచించుటకే సంఘటించినాఁడు. 'నితంబా భోగ ధవ

ళాంశుక'మను పెద్దనార్యప్రయోగము నందు సార్ధకమంజిమ యున్నది. ధవళాంకుక ప్రశంసచే తెలుఁగు పడఁతుల సహజ దేశీయ వేషమునకు (విలక్షణత' బోసియున్నాడు. తెల్లచీరలు ధరించు నితంబినీమణులలో తెలుఁగుదేశీయులు ప్రధానులు.

వయసు.

వరూధినికి తరుణి, నవలా, మున్నగు విశేషణములు వాడఁబడి యున్నవి.ఐనను వయసు నిర్ణయించుట కింతకంటె సహజరసోచితములును, ప్రత్యేక స్థలప్రసక్తములును నగు నిదర్శనములు కావలెను. నాయిక వయస్సును నిరూపించుటకుఁ గావ్యమునందే అంతస్సాక్ష్య సంపత్తి నన్వేషింతము, విజయవిలాసమునందు

చ.

కన్నియఁగాని వేఱ కటిగాదు.....నీకు నే
జన్నియఁ బట్టియుంటి నెలజవ్వనమంతయు'

అను పద్యమునుబట్టి కావ్యక్రమమున ఉలూచి వయసు నూహింతుము. ఇంత స్ఫుటముగ వరూధిని వయసు ని