Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నీరుఁ గ్రోలెడునప్పటినినద మనుచు, నదియె లక్ష్యముగా విషప్రదర మొకటి
దాఁక నేసిన దానిచే నీకుమారుఁ, డార్తరవమున నిహతుఁ డై యవనిఁ బడియె.

1342


క.

ఏ నారవంబు విని యను, మానించుచు నచటి కరిగి మద్బాణహతుం
డై నేలం గూలిన నీ, సూనునిఁ గని తీవ్రశోకశోషితమతి నై.

1343


క.

ఒక్కింతసేపు చింతిలి, గ్రక్కునఁ దద్వచనసరణిఁ గాండముఁ బెఱుకన్
మిక్కిలికృపచే నను మీ, చక్కటి కేగు మని చెప్పి చనియె మహాత్మా.

1344


తే.

అధికవృద్ధు లంధు లతిదీను లమితత, పోనుషక్తచిత్తు లైనమీకు
వేచి యింతపాప మాచరించిన నన్నుఁ, దాల్మిఁ జేసి ప్రోవఁ దగు మహాత్మ.

1345


వ.

ఇంకఁ జిత్తంబుకొలంది నవధరింతురు గాక యని విన్నవించిన యశనిపాతకల్పం
బెైననావచనంబు విని భగవంతుం డైనయత్తాపసోత్తముండు శోకానల
జ్వాలాజలదందహ్యమానమానసుం డై బాష్పంబులు నించుచుఁ దీవ్రాయాసం
బు నడంప నశక్తుం డై బహువిధంబుల సంతపించుచుఁ గృతాంజలిపుటుండ
నై యున్ననా కి ట్లనియె.

1346


సీ.

మనుజేంద్ర నీ వొనర్చిన యీమహాఘంబు నేర్పున నీయంత నీవె వచ్చి
చెప్పుటవలన నీశీర్షంబు పదివేలవ్రక్క లై పోవక తక్కె నేఁడు
నరపతిచేత వానప్రస్థసంయమివధ మనజ్ఞానపూర్వముగఁ జేయఁ
బడె నేని హరి నైనఁ బరఁగ బదభ్రముఁ గావించు బ్రహ్మనిష్ఠావిధిజ్ఞుఁ


తే.

డై తపము సల్పుమునివరునందు శస్త్ర, మెఱిఁగి విడిచినఁ దన్మూర్ధ మేడువ్రక్క
లై చనదే కనిసేయనిదగుట మంటి, వెఱిఁగి చేసినఁ గుల మెల్ల మఱిఁగిపోదె.

1347


చ.

జనవర మత్సుతుండు శరసంహతుఁ డై పడియున్నచోటికిన్
ననుఁ గొని పొమ్ము వేగ పితృనాథవశంగతుఁ డై విసంజ్ఞుఁ డై
పనుపడ నెత్తుటం దడిసి పశ్చిమదర్శనుఁ డై ధరిత్రిమీఁ
ద నొరగి యున్నవాని గుణధన్యునిఁ బుత్రునిఁ జూడఁ గోరెదన్.

1348


తే.

అనుచు మునిపతి పల్క, నే నాత్మ నడలు, గూర నచటికి వారిఁ దోడ్కొని రయమునఁ
జని కుమారునిఁ జూపినఁ దనువుమీఁద, వ్రాలి శోకంబుచే మౌనివరుఁడు పలికె.

1349


ఉ.

ఓయి కుమారవర్య మము నొంటిగ నిచ్చట డించి పోవఁగా
న్యాయమె నీకుఁ దల్లివగ పాఱఁ బ్రియోక్తులు పల్క వేల తం
డ్రీ యని మ్రొక్క వేల నయ మేర్పడఁ గౌఁగిటఁ జేర్ప వేల యే
లా యిలపై వసింపఁ గుపితాత్ముఁడ వైతి వదేల చెప్పుమా.

1350


క.

ఇఁక నపరరాత్రమందును, సకలామ్నాయములు సకలసద్వృత్తంబుల్
సకలాధ్యాత్మకథలనుం, బ్రకటంబుగఁ జదువుచుండువాఁ డెవ్వఁ డిఁకన్.

1351


క.

శీలంబు భక్తి నియమము, గ్రాలఁ బవిత్రాగ్ని వేల్చి గారవ మెసఁగన్