Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భరతుఁ డీపూజ్యసామ్రాజ్యస్థుఁ డగుఁగాక యని కోరువారల యమునిపురికిఁ


తే.

బనుతుఁ గామాంధుఁడై యాలిపలుకులు విని, బుద్ధి నరయక లోకవిరుద్ధవృత్త
మూఁది పరిపంథిభూతుఁడై యున్న నృపునిఁ, గడఁగి చంపెదఁ గానిచోఁ గట్టివైతు.

487


వ.

తండ్రి కపరాధంబు సేయం దలంచుట ధర్మవిరుద్ధం బని తలంచి తేని వినుము.

488


తే.

విషయతంత్రుఁడై ధర్మవిధికిఁ దప్పి, మది ననారత మిది కార్య మిది యకార్య
మని యెఱుంగక వర్తించునతఁడు తండ్రి, యైనఁ గడువధ్యుఁడని పల్కి రార్యు లధిప.

489


క.

జనపతి నీ దగురాజ్యముఁ, గొనుటకు నేబలము గలఁడు గుణహీనతఁ దా
మునుకొని యేకారణమునః, దనమదిఁ గైకేయి కొసఁగఁ దలఁచె మహాత్మా.

490


తే.

పరఁగ నీతోడ నాతోడ వైరముఁ గొని, యరినిషూదనకులయోగ్య మయినయట్టి
ధర్మనిధి నీవు దాల్పఁగఁ దగినసిరిని, భరతుని కొసంగఁ బతి కేటి బలము చెపుమ.

491


వ.

అని పలికి క్రమ్మఱఁ గౌసల్య నవలోకించి తల్లీ యేను సర్వప్ర కారంబుల రా
మున కనురక్తుండ నిది యసత్యంబు గాదు సత్యచాపదానేష్టంబులచేత శప
థంబుఁ జేసి పలికెద రాముం డరణ్యంబునె కాదు దీప్తాగ్నిని బ్రవేశించిన నే నం
తకు మున్నె ప్రవేశింతు నట్టివానిఁగా న న్నెఱుంగుము.

492


చ.

జననిరొ నాప్రతిజ్ఞ విను సత్యము నీవును రాఘవుండుఁ గ
న్గొని మది మెచ్చ దీప్తశరకోటి నరాతుల గీటడంచి మిం
చినయనురక్తిచే నినుఁడు చీఁకటినట్లు భవన్మనోవ్యధం
బనివడి తీర్చెదన్ ధరకుఁ బట్టముఁ గట్టెద రామభర్తకున్.

493

కౌసల్య రామునికి లక్ష్మణుఁడు చెప్పినట్ల చేయుమని బోధించుట

వ.

అని యిట్లు వీరాలాపంబు లాడుచున్న సుమిత్రాపుత్రునివాక్యంబు లాలకించి
యద్దేవి రామునివదనం బులక్షించి దుఃఖించుచు ని ట్లనియె.

494


మ.

అనఘా తమ్మునిమాట వింటె విహితం బై యున్న దారీతి
ననుమానింపక సేయు టొప్పు నృపవంశాచార మీచందమై
చనుఁ గా కీవు సపత్నిమాటకయ రాజద్రాజ్యభోగంబు మా
ని నను న్నెవ్వగ ముంచి పోవఁ దగ వౌనే కాననక్షోణికిన్.

495


వ.

మఱియు నీవు పితృవాక్యకరణరూపం బగుధర్మం బనుష్ఠించుట సమస్తధర్మం
బులలో నుత్తమధర్మం బని దలంచితి వది నిక్కంబైనను నీలోకంబున మాతృ
శుశ్రూషాపరుం డై ప్రవర్తిల్లుమహాత్మున కెల్ల లోకసుఖంబులు కరతలా
మలకంబులై యుండుఁ దొల్లి గృహంబున నుండి మాతృశుశ్రూవఁ గావించి
తద్బలంబునఁ గాశ్యపుండు ప్రాజాపత్యపదంబుఁ బ్రాపించెఁ గావున నీవును నా
వచనంబుఁ బట్టి భక్తిపూర్వకంబుగా నాకు శుశ్రూషఁ గావించుచు గృహం