పుట:Gopinatha-Ramayanamu1.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


థుండు సంతుష్టాంతరంగుండై సుమంత్రుతో ఋశ్యశృంగుండు గణికలచేత
నెత్తెఱంగున నానీతుం డయ్యె దాని సవిస్తరంబుగా వినవలతుం జెప్పు మని
యడిగిన నతండు సనత్కుమారోక్తప్రకారంబున మహీరమణున కి ట్లనియె.

258

సుమంత్రుఁడు దశరథునకు ఋశ్యశృంగానయవిధంబుఁ దెల్పుట

ఆ.

అధిప రోమపాదుఁ డాఋశ్యశృంగుఁ డిం, కెవ్విధమున నిచటి కేగుదెంచు
నని తలంచుచుండ నాసమయమునఁ బురోహితుండు పలికె నూహఁ జేసి.

259


తే.

మాకు శక్యంబు గాదు యమ్మౌనిసుతునిఁ, దోడి తెచ్చుట కాత్మలోఁ దోఁచినంత
పాటినిరపాయ మైనయుపాయ మొకటి, యేను జెప్పెద వినుము మహీశవర్య.

260


ఉ.

ఆమునినందనుం దుదయ మాదిగఁ గానల నుంటఁ జేసి తాఁ
గామినిరూపయౌవనవికాసము నింద్రియసౌఖ్యసౌష్ఠవం
బేమి యెఱుంగఁ డించుకయు నెప్పుడు నన్యులతోడిపొత్తుఁ గై
కోమి గుణప్రభూత మగుకోపముఁ గైకొన కుండుఁ గావునన్.

261


వ.

ఇప్పుడు రూపయౌవనసంపన్న లగువారకాంతలు బహువిధాలంకారంబులం
గైసేసి మునిపాలికిం జని మనోరమాభిమతేంద్రియార్థంబులచేత నతనిచిత్తం
బు వడసి నానావిధోపాయంబుల నిచ్చటికిం గొనితెచ్చెదరు శీఘ్రంబున నట్టి
వారి నేర్పఱించి పంపు మనిన నమ్మహీరమణుండు రూపయౌవనవిలాసతిర
స్కృతాప్సరఃకాంత లగువారకాంతల నమ్మునిపుత్రుపాలికిం జనుం డని.

262


చ.

పనిచిన వేడ్కతోఁ దపసి భవ్యతరాశ్రమభూమి కేఁగి రా
వనరుహగంధు లందమున వారక గంధవహాస్యపుష్పనూ
తనశుకశారికాభిసముదాయమరాళమయూరపఙ్క్తు లొ
య్యన సయిదోడుగా నడువ నవ్వలరాయనితూపులో యనన్.

263


వ.

ఇట్లు తదాశ్రమసమీపంబునకుం జని.

264


తే.

వనచరుఁడు ధీరుఁ డాశ్రమవాసి పురుష, మానినీతారతమ్య మింతైన నెఱుఁగఁ
డమ్మునికుమారుఁ జూచు టె ట్లతనితోడఁ, బలుకు టెట్లు తచ్చిత్తంబు పడయు టెట్లు.

265


క.

పితృపూజాతత్పరుఁ డై, సతతతపోయుక్తి నాత్మసంతుష్టుం డై
చతురత నొప్పెడు నమ్ముని, పతి యె ట్లాశ్రమము విడిచి పఱతెంచునొకో.

266


తే.

జనన మాదిగ నమ్మహామునిసుతుండు, పురమునందు రాష్ట్రమునందుఁ బుట్టినట్టి
పురుషునైనను సతినైన మఱియు నన్య, మెెద్ది యేనియు నెఱుఁగఁ డొకించుకైన.

267


క.

అనుచుఁ దలపోయునెడ న, మ్మునిపుత్రుఁడు దైవయోగమునఁ జేసి తనం
తన తాను వారియొద్దకుఁ, జనుదెంచినఁ జూచి చెలులు సంభ్రమ మలరన్.

268


చ.

సలలితచిత్రకంచుకము చాటునఁ గుల్కు మిటారిగబ్బిగు
బ్బ లొలయఁగా హిరణ్మయవిపంచికలం ధరియించి వారకాం
తలు మునిపుత్రుకట్టెదుటఁ దంత్రులు మీటుచు రాగసంపద