పుట:Gopinatha-Ramayanamu1.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వేదవేదాంగవిదు లైనవిప్రవరులఁ బిలువ నంపించి యిట్లని పలుకు నపుడు.

244


క.

మునివర్యులార మీ రెఱుఁ, గనియర్థ మొకింత లేదు కద ముల్లోకం
బున నేయుపాయ మొనరిం, చిన వానలు గురియు దానిఁ జెప్పుఁడు మీరల్.

245

వ.

అని యడిగిన నమ్మునీంద్రు లన్నరేంద్రునిం జూచి యీయనావృష్టి వాయు
టకుం దగినయుపాయం బెఱింగించెదము వినుము.

246


క.

ఘనుని విభాండకతనయునిఁ, బ్రణుతగుణుని ఋశ్యశృంగు రావించి భవ
త్తనయను శాంత నొసఁగి మిం, చినయనురాగమునఁ బెండ్లి సేయుము ప్రీతిన్.

247


తే.

ఈయుపాయంబుఁ దక్కి యెం డేయుపాయ
మునఁ జనదు యీయనావృష్టి యని మునీంద్రు
లానతిచ్చిన విని విభుఁ డామునీంద్రుఁ
డిచటి కరుదెంచుట కుపాయ మెద్ది యొక్కొ.

248


వ.

అని బహుప్రకారంబులం దలపోసి నిశ్చయించి.

249


క.

తనమంత్రులను బురోహితుఁ, గనుఁగొని మునినాథునిం దగం దోడ్కొని రం
డని పలికిన వారు మనం, బున నెక్కుడు భయము గదుర భూపతితోడన్.

250


క.

మోమున దైన్యం బడరఁగ, నే మామునిసుతునిపాలి కేగఁగ లే మో
భూమిూశ యనుచు వేఁడిన, నామనుజవిభుండు చిత్తమందుఁ దలఁకుచున్.

251


వ.

ఇంక నెయ్యది కార్యం బని విచారించుచున్నంత.

252

రోమపాదుండు వేశ్యలచే ఋశ్యశృంగుఁ దోడి తెప్పించుట

క.

లలితసుకుమారయౌవన, కలితాంగులు రూపవతులు గణికలు నృపు ముం
గల నిల్చిరి నయమున నం, జలిఁ జేసి మృదూక్తు లలరఁ జతురత మెఱయన్.

253


క.

జనవర యే మామునినుతు, ననుపమచాతుర్య మొప్ప నతిరయమునఁ దో
డ్కొని వచ్చెద మిప్పురమున, కనుపుము మము మా కసాధ్య మవనిం గలదే.

254


వ.

అని పలికి యమ్మహీపతిచే ననుఙ్ఞాత లై యవ్వారకాంతలు వనంబునకుం జని
వివిధోపాయంబుల నమ్మునిసుతునిచిత్తంబు లోఁగొని పురంబునకుం దోడ్తేరఁ
గల రట్లు దోడ్కొని వచ్చిన.

255


క.

మునిపతి వచ్చినమాత్రనె, తనివి సన న్వృష్టి గురియు ధరణీవిభుఁ డా
యన సత్కరించి గ్రక్కునఁ, దనకూఁతును శాంత నొసఁగుఁ దద్దయుఁ బ్రీతిన్.

256


తే.

రోమపాదునిజామాత లోకనుతుఁడు
ఋశ్యశృంగుఁడు మీకు సంప్రీతి సుతుల
నిచ్చు నని పల్కె తొల్లి మునీంద్రుఁ డాస
నత్కుమారుఁడు మునులు వినంగ నధిప.

257


వ.

ఏ నత్తెఱంగు సంక్షేపంబుగా మీకుం జెప్పితి నని విన్నవించిన విని యద్దశర