పుట:Gopinatha-Ramayanamu1.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ల్దలకొనఁ బాడి రందు సుకలస్వరముల్ సరవిం జెలంగఁగన్.

269


వ.

ఇట్లు సుస్వరంబుగా గానంబుఁ జేయుచు నమ్మునిచెంత నిలిచి యతనితో ని
ట్లనిరి.

270


క.

ధరణీసుర నీ వెవ్వఁడ, నరయఁగ నతిఘోర మీమహాగహనమునన్
జరియించె దేల యొంటిగఁ, దిరముగ నీకలతెఱంగుఁ దెలియం జెపుమా.

271


ఆ.

అనుచు వార లడుగ నమ్మునితనయుండు, హృష్టచిత్తుఁ డై యదృష్టపూర్వ
లగుటఁ జేసి మిగులహార్దంబువలన న, య్యిందుముఖులఁ జూచి యిట్టు లనియె.

272


తే.

బ్రహ్మసముఁడు మాతండ్రి విభాండకాఖ్యుఁ, డతని కౌరసపుత్రుండ నౌదు నేను
బృథివి నానామ మది ఋశ్యశృంగుఁ డనఁగ, నధికవిశ్రుతమై యొప్పు ననుదినంబు.

273


వ.

ఇది మదీయాశ్రమంబు మీ కందఱికి విధిపూర్వకంబుగా నతిథిసత్కారంబుఁ
గావించెదఁ బ్రతిగ్రహింపుం డని పలికిన నతనిపలుకుల కలరి యవ్వెలందులు
పర్ణశాలలోనికిం జనిన.

274


క.

మునినందనుండు వారికిఁ, బనిగొని యుచితాసనార్ఘ్యపాద్యంబులు నూ
తనమూలఫలంబులు స, య్యన నొసఁగి కృపన్ గ్రహింపుఁడని వేఁడుటయున్.

275


క.

వారంద ఱుత్సుకంబున, గౌరవమునఁ దపసిపూజఁ గైకొని మరలన్
శైరీషకుసుమపేశల, సారామృతకల్పసూక్తి సంయమితోడన్.

276


ఆ.

మునికుమార నీకు ముఖ్యఫలంబులు, దివిరి కాన్క గాఁగఁ దెచ్చినార
మివె పరిగ్రహింపు మిప్పుడె భక్షింపు, మలఘుతేజ శుభము గలుగు నింక.

277


చ.

అని నయ మారఁ బల్కి చెలులందఱు కౌతుక ముప్పతిల్లఁగా
మునిసుతుఁ గౌఁగిలించుకొని మోద మెలర్పఁగ మోదకాదినూ
తనబహుభవ్యభక్ష్యము లుదారత నిచ్చిన నారగించెఁ బా
వనగుణమూర్తి నిక్కముగ వన్యఫలంబు లటంచు నెంచుచున్.

278


వ.

అంత నక్కాంతలు మునివలని భయంబున వ్రతచర్యోపదేశంబు నతనికిం జెప్పి
యరిగిన నవ్విభాండకనందనుం డస్వస్థహృదయుండై తద్వియోగజనితదుఃఖం
బునం బెటలిపడుచు నారేయి గడిపి మరునాఁడు తదాశ్రమసమీపంబున విహ
రించునెడ నెప్పటియట్ల యలంకృత లై వెలయాం డ్రమ్మునికిం బొడసూపి తగు
తెఱంగున నుపసర్పించి తచ్చిత్తం బాత్మాయత్తం బయ్యెనని హర్షించి యతని
కిట్లనిరి.

279


చ.

అనఘచరిత్ర తాపనకులాంబుధిపూర్ణశశాంక మీతపో
వనమున కేగుదెంచితిమి వారక మే మిఁక మీరు మాతపో
వనమున కర్థి రావలయు వంచన సేయక యంచుఁ బల్క
మునిసుతుఁ డట్ల కాక యని మోద మెలర్పఁగ సమ్మతించినన్.

280


చ.

తరుణులు నత్తపస్విని ముదంబున గ్రుచ్చి కవుంగిలించి చె