పుట:Gopinatha-Ramayanamu1.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బలంబులతోఁ గూడి రామపాదప్రసాదకుండై వనంబునకుం జని యార్యభావ
పురస్కృతుండై మహాత్ముండును సత్యపరాక్రముండును నభిరామదర్శనుండును
నగురామునిం జేరి మహాత్మా నీవు సర్వగుణశ్రేష్ఠుండైనను కనిష్ఠునకు రాజ్యా
ర్హత్వంబు లేమి యెఱింగి ధర్మజ్ఞుండవు గావున నీవె రాజ వని పలికిన సర్వస్వరూ
పగుణంబులచేత నాశ్రితచిత్తరంజకస్వభావుండయ్యును వనీపకాభీష్టప్రదానత
త్పరుండయ్యును యాచకజనలాభంబుచేతఁ బ్రసన్నవదనుండును మహాయశుం
డయ్యును నేకసాయకవిమోచనమాత్రంబున సమస్తదానవహననసమర్థుం
డయ్యును రాముండు పితృవచనగౌరవంబున రాజ్యం బంగీకరింపక రాజ్యంబు సే
యుట కహల్యాదృష్టవైభవపాదసంస్పృష్టంబు లైనపాదుకలు న్యాసరూపంబున
భరతున కొసంగి బహువిధసాంత్వవచనంబుల సారెసారెకు నతనిఁ గ్రమ్మఱించిన
నాభరతుం డభిషేకార్థంబు రామప్రత్యానయనలక్షణమనోరథంబు నొందక
నందిగ్రామంబునం దనుదినంబును రామపాదుకలకు నమస్కరించుచు రామా
గమనకాంక్షుండై రాజ్యంబుఁ బాలించుచుండె నంత సర్వాతిశయకాంతిమం
తుండును సత్యప్రతిజ్ఞుండును రాజ్యభోగలౌల్యరహితుండు నగురాముండు భర
తుండాదిగాఁ గల పురజను లందఱు వెండియుఁ జిత్రకూటంబునకుం జనుదెంతు
రని తలంచి పితృవచనపరిపాలనంబునం దేకాగ్రచిత్తుండై దండకారణ్యంబుఁ
బ్రవేశించె నని యి ట్లయోధ్యాకాండకథ యంతయు సంక్షేపంబుగా నెఱిం
గించి యద్దేవమునిశ్రేష్ఠుం డారణ్యకాండకథాక్రమం బెఱింగించువాఁడై
వెండియు నిట్లనియె నట్లు రాజీవలోచనుండగు రాముండు మహారణ్యంబగు దండ
కారణ్యంబుఁ బ్రవేశించి యపూర్వసంస్థానవనవిలోకనజనితకుతూహలంబు
చేతను మహావనప్రవేశసంభావితరాక్షసరణారంభోర్జితహర్షంబుచేతను విక
సితలోచవారవిందుండై.

92


తే.

మునివిరోధి విరాధుని మొనసి చంపి
మాననీయాంగు శరభంగుమౌనిఁ జూచి
ఘను సుతీక్ష్ణమహాముని గని యగస్త్యు
ననుజుఁ జూచి యగస్త్యునిఁ గని ముదమున.

93


తే.

ఆయగస్త్యమహామునియనుమతమున, నైంద్ర మగుకార్ముకంబు మహాసిపత్రి
దారుణాక్షయబాణతూణీరములును, రిపువినిగ్రహార్థంబు పరిగ్రహించె.

94


వ.

ఇట్లు జగదేకవీరుం డగురాముండు స్వవీర్యసదృశవరాయుధలాభంబు నొంది
పరమప్రీతుండై శరభంగవనంబున నివసించియుండ నప్పు డచ్చటి మహర్షులు
చిత్రకూటపంపావన నివాసులయిన వానప్రస్థులం గూడి యసురరాక్షసవధా
కాంక్షులై రాముని సమీపంబునకుం జనుదెంచి రాక్షసబాధ నెఱింగించిన