పుట:Gopinatha-Ramayanamu1.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వాక్యచోదితయై తొల్లి దేవాసురయుద్ధంబునందు వల్లభునిచేత దత్తవరయైనది
గావున నాసమయంబునఁ గట్టఁడితనంబున దిట్ట యై రామునకు వివాసనంబును
నిజపుత్రుండైన భరతునకు రాజ్యాభిషేకంబునుం గోరిన నమ్మహీరమణుండు సత్య
వాది గావున ధర్మమయపాశనిబద్ధుండై విడివడ సమర్థుండు గాక ప్రియపుత్రుండైన
ను రాముని వనంబునకుం బనిచిన నవ్వీరోత్తముండు కైకేయీప్రీతినిమిత్తంబు
పితృవచననియోగంబువలనఁ దద్వచనపరిపాలనవిషయస్వకృతప్రతిజ్ఞను బరిపా
లించుచు వనంబునకుం జనిన నమ్మహాత్మునితమ్ముండు సుమిత్రానందవర్ధనుం
డగులక్ష్మణుండు సహజప్రీతిమంతుండును నిష్టుండును గావున వినయసంపన్నుం
డై సౌభ్రాత్రంబుఁ జూపుచు స్నేహంబువలన ననురూపం బగు వ్రతం బంగీ
కరించి యన్నవెంట నరణ్యంబునకుం జనియె.

83


ఉ.

ఆరఘునాథుభార్య జనకాలయజాత సమస్తలక్షణ
శ్రీరమణీయరూప హితశీల సతీతిలకంబు నిందిరా
కారయు సాధ్వి ప్రాణములకంటే గరీయసి యైన సీత సొం
పారఁ బతిన్ భజించి చనె నప్పుడు రోహిణి చంద్రునిం బలెన్.

84


క.

పౌరులచే జనకునిచే, దూరం బారాముఁ డనుగతుం డగుచు రయం
బారఁగ ననుజుఁడు సీతయు, వారక తనతోడ రాఁగ వనమున కరిగెన్.

85


తే.

ఈతెఱంగునఁ జని జాహ్నవీతటమున, శృంగిబేరాఖ్యపట్టణ మేలువానిఁ
బరమసఖుని నిషాదాధిపతిని గుహునిఁ, జేరి సూతునిఁ గ్రమ్మఱ నూరి కనిచి.

86


ఆ.

అట నిషాదనాథుఁడైన యాగుహునితో, నలఘుయశుఁడు చాలఁ జెలిమిఁ జేసి
వానియనుమతమున జానకీలక్ష్మణ, కలితుఁ డగుచు వేగ గంగ దాఁటి.

87


క.

భూవల్లభుండు రాముఁడు, తేవనమున వనము సొచ్చి ధీరత్వమునం
ద్రోవ నవవారిపూరిత, పావననదు లుత్తరించి పరమప్రీతిన్.

88


తే.

చతురుఁ డగుభరద్వాజునిశాసనమునఁ
జిత్రకూటాద్రిఁ జేరి తచ్చిఖరిమీఁద
వేడ్కతోఁ బర్ణశాలఁ గావించి యందు
నిండుసుఖగోష్ఠి వసియించి యుండె నంత.

89


వ.

దేవగంధర్వసంకాశు లైన సీతారామలక్ష్మణులు మువ్వురు చిత్రకూటోపాంత
వనంబునందు రమమాణులై సుఖంబుగా నివసించి యుండి రిట సాకేత
పురంబున.

90


క.

ఆరఘువర్యుఁడు శైలముఁ, జేరుట విని పుత్రశోకచింతార్దితుఁడై
దారుణగతి విలపించుచు, భూరమణుఁడు మేను విడిచి పోయెన్ దివికిన్.

91


వ.

దశరథమరణానంతరంబున మహాబలుండగు భరతుండు వసిష్ఠప్రముఖ మహర్షుల
చేత రాజ్యంబునందు నియుజ్యమానుండయ్యును దానినంగీకరింపక చతురంగ