పుట:Gopinatha-Ramayanamu1.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నారఘుపుంగవుండు రాక్షసావాసభూతంబైన వనంబునందు నమ్మహామునుల
ప్రార్థనావచనం బంగీకరించి.

95


ఆ.

దహనకల్పు లైనదండకారణ్యని, వాసిమునులమ్రోల వరుసతోడ
సంగరమున నింక సకలరాక్షసుల వ, ధించువాఁడ నని ప్రతిజ్ఞఁ జేసి.

96


క.

అనఘుఁడు రాఘవుఁ డక్కా, ననమున నివసించి తగ జనస్థాననివా
సిని యగుశూర్పణఖను గ్ర, క్కునఁ బట్టి విరూపఁ జేసె ఘోరాసిహతిన్.

97


వ.

ఇట్లు కామరూపిణియైన శూర్పణఖను గర్ణనాసికాచ్ఛేదంబున విరూపిణిం జేసి.

98


క.

శూర్పణఖాప్రేరితుఁ డై, దర్పంబున సమరమునకుఁ దఱిసినఖరుని
న్నేర్పున వధించె రాముఁడు, సర్పాభీలోగ్రతీవ్రశాతశరములన్.

99


వ.

ఇట్లు రాక్షససేనాధ్యక్షుం డైన ఖరునిం బరిమార్చి తదనుచరు లైనదూషణ
త్రిశిరుల వధించి పదంపడి చతుర్దశనహస్రసంఖ్యాకప్రధానరాక్షసుల నాజిరం
గంబున నంతంబు నొందించి తదనుచరు లైనయామినీచరుల నందఱ నిశ్శేషం
బుగా రూపుమాపె నంత నకంపనశూర్పణఖలవలస జ్ఞాతివధం బంతయు విని
రావణుండు క్రోధమూర్ఛితుం డై సీతాహరణకార్యంబునందు మారీచుండను
రాక్షసుని సహాయునిఁగా వరించి బలవంతుం డైన యారామునితోడి విరోధంబు
యుక్తంబుగా దుడుగు మని బహుప్రకారంబుల నమ్మారీచునిచేత నివార్య
మాణుం డయ్యును వానివచనం బనాదరణంబు చేసి కాలచోదితుం డై మారీ
చసహితంబుగా రాముని యాశ్రమస్థానంబునకుం జనుదెంచి.

100


శా.

మారీచుం డొకమాయఁ బన్ని యల రామక్ష్మావరున్ లక్ష్మణున్
దూరంబు న్గొనిపోయినప్పు డదయన్ దోషాచరాధీశ్వరుం
డారామామణి సీత నెత్తికొని ఘోరాకారుఁ బక్షీంద్రు దో
స్సారోదారు జటాయువుం దునిమి భాస్వల్లీల నేగె న్వడిన్.

101


తే.

అంత రాముండు దైత్యశితాసిలూన, పత్రపాదుఁ డై పడియున్న పక్షినాథుఁ
గని మహీపుత్రి హృత యౌట విని దురంత, గాఢతరదుఃఖభరమున గాసిపడుచు.

102


క.

చలితేంద్రియుఁ డై మిక్కిలి, పలవించుచు రామవిభుఁడు పక్షీంద్రునకు
న్విలసితశాశ్వతసౌఖ్యము, గలుగఁగ సంస్కారవిధులఁ గావించి వెసన్.

103


క.

వనమున జానకి వెదకుచుఁ, జనిచని యొకచోటఁ గాంచె సత్త్వోద్రేకం
బున జగము మ్రింగఁ జాలెడు, ఘనరూపుని ఘోరవికృతకాయుఁ గబంధున్.

104


వ.

కనుంగొని వానిభుజంబులు రెండును నిశాతఖడ్గంబుల ఖండించి పంచత్వంబు
నొందించి తత్కళేబరంబు దహించిన వాఁడు స్వర్గగమనయోగ్యం బగుస్వకీ
యం బైనగంధర్వరూపంబు నొంది రామునిం జూచి మహాత్మా నీవు శ్రవణకీర్త
నాదిభగవధ్ధర్మాచరణశీలయు సామాన్యవిశేషధర్మనిపుణయుఁ జతుర్థాశ్రమ
ప్రాప్తజితేంద్రియత్వపూర్వకమోక్షోపయుక్తాచారనిష్ఠయు నైనశబరిఁ గానం