పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/411

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏను నిద్రా దేవి ఏర్పడదెల్పు
విధి విదించెను వెంట వెంట వర్తిల్వ్
విధమేది నిన్నునే విడుచుటకింక
అనిన ఊర్మిళయందు అహరహమ్ములును
జనియుండు మంత యీసమయంబులు తీర్చి
వచ్చిన గైకొందు పరుస నిన్ననిన
నిచ్చనాగాక్ంచు ఏగె నిద్రయును"

  ఈ విషయంకూడా ఆవాల్మీకమే-అయినా కాదంటే అమ్మేవారులేరు.  ఇలాంటి కల్పనలెగాకుండా పాత్రలనుకూడా తెలుగువరి మనోభావాలకనుగుణంగా తీర్చిదిద్ధాడు బుద్దారెడ్ది.  భర్త వాలిని చంపిన రాముని దగ్గరకువచ్చి తార యిలా విలదీస్తుంది.

"జన నాధ యీవాలి చ్ంపనేమిటికి ?
ఎరవొప్ప నీ రాజ్య విభవంబు గొన్న
భరతుడే రఘురామ వరికింప వాలి?
చెనటియై నీ భార్య చెరగొని చన్న
దనునజుడే రఘురమ తలపోయవాలి
నీ యట్టి కారుణ్య నిధికిట్లు తనే?
జనకజతొ కూడి చనియెనా ఎరుక?"

   ఏమయ్యా రామా ! నీరాజ్యాన్ని అపహరించిన నీ తమ్ముడు భరతుడు కాడే వాలి! నీ భార్యనె?ట్తుకొనిపొయిన రావణుడు కాడే వాలి! నీకేం అపకారం చేశాడని చంపావు? నీ జ్ఞానమంతా సీతతోనే ఎగిరిపోయిందా? వాలిలేకుండా నేను బ్రతకగలనా? నన్నుకూడా తెగటార్చు అనె మాటలతో తార పాతివ్రత్యాన్ని ప్రతిజ్ఞష్ఠాపించాడు.  వాల్మీకంలో తార జరిగిందేదో జరిగిపోయింది అనె సామాన్య స్త్రీ మోస్తరుగానే కనిపిస్తుంది.
  వర్ణలలో అలంకారాలుకూడా జానపదులకు పరిచితమైన విషయాల మీదే అమర్చాడు.  ఋష్యమూక పర్ఫతం దగ్గరకు రామలక్షమణులురాగనే ఆకొండపొందిన ఆనందం ఎంతో నిండుగా  ఉత్ప్రేక్షిసాడు.

"త్రైలోక్యవిభులైన తమ రాక చూసి
ఆలోచన మది పొంగి ఆనంద మంది