223 బొప్పూడి తా॥ ఐదు విధములగు మంగళవాద్యములతోడను, ఛత చామరాందోళికాది రాజ భోగములతో నొప్పారెడి భయంకర దేహుడును, దాతి (భూమి) యందున్న బాటసారుల కన్న సత్రము వంటివాడును, పూజ్యులకు గూడ పూజ్యుడును, ధనకనకాదులచే వృద్ధిబొందిన కీర్తిగలవాడును, తన గ్రామముకు సరోవరమునకు సూర్యునివంటివాడును, గొప్ప మహిమచే నార్జింపబడిన ధన్యుడును, మూడు లోకములందలి దీనుల వశమొపర్చిన శరీరము గలవాడును, ధనమధిక ముగసుండుటచే సత్యసంధు కనిపించుకొన్న చోడ వంశతిలకుడును, అగు భయంకర మూర్తి ప్రోలచక్రవర్తి- ఆ వంశమనెడు పద్మాకరము నారు భాస్కరుని వంటివాడును, కార్మికులలో (సత్కర్మానుష్ఠానపరులకు) ధర్మమూర్తియు, హరిహరుల సేవా పరాయణుడగు గన్నెచోడ మహారాజోకడు యను సాధక బిరుదాంక్కితులు ప్రసిద్ధి పదశి ప్రభుత్వం చేస్తూ శ్రీ కేశవస్వామి వార్కి సూరనగుంట్ట పాటి గ్రామంలోను పది పుట్ల భూమి ధారా గ్రహితం చేశెను. ఇందుకు శ్లోకము : 3 I శ్రీ శాలే శకవత్సరే నిధిరిని ప్యోమ క్షమా సౌంజికే, కార్తీక్షాక్యాంగ్రహణాధీ పాన్య నృపతే శ్రీ గఃన్న చోడేసుధి గ్రామేసూదనపాటి నామ్మి దశ కే భూమిం తదా ఖండకై తస్మా దేవతయా స్త్రీ లోక గురవే శ్రీ కేశవాయాదదాత్. శ్లో॥ శ్రీ శాలేశ్శక వత్సరే నిధి దివివ్యోమ క్షమాసంజ్ఞికే కా ర్తిక్యాం గ్రహణం ధిపో వ్యనృపతేః శ్రీ గన్నెచోడస్సుధీః గ్రామే సూదన పాటి నామ్ని దశకే భూమింత దాఖండకిం తస్మాదేవత యాత్రి లోక గురవే శ్రీ కేశవాయాదవత్ ॥ తా॥ శాలివాహన శక వత్సరములు- 1009కి సరియగు చాంద్రమాన వత్సర క్షయ నామక కార్తీక శుద్ధ పూర్ణిమాగ్రహణ కాలమందు సామంతరాజులకు రాజైన గన్నెచోడ రాజు సూదనపాటి గ్రామమున దేవతగా నెలకొన్న కేశవస్వామికి సమర్పించెను.) అని యీ ప్రకారంగ్గా స్వస్తిశ్రీ శాలివాహన పరుషంబులు ౧౦౦౯ (1087 AD) ఆగునేటి కాతీక బ॥ 30 రోజున గంన్నచోడ మహారాజులుంగ్గారు, సూరనగుంట పాటి గ్రామంలో పది పుట్లభూమి త్రిలోక గురువైనఘవంట్టి శ్రీ కేశవస్వామి వారికి ధారాగ్రహితం చేశి యేతత్ర మం శిలాశాసనం మీద లిఖింప్పచేశిచేవారు. వడ్డెరెడ్డి కన్నాకొట్క ప్రభుత్వములు ౧౫౦౦ శకం (1578 AD) వర్కు జరిగిన తర్వాతను మొగలాయి ప్రభుత్వము వచ్చెను గన్కు పూర్వపు రాజులు నిసకాయించ్చిన స్వామివాల యొక్క బహకీ (బహులు) స్వాస్యములు జప్తు చేస్కుని నిత్య నైవేద్య దీపారాధనల్కు మొగలాయి వారు నిన్నకాయింద్ని కుచ్చెళ్ళు.