ప్రెంచి స్వాతంత్ర్య విజయము
లూథరు పోవు యొక్క అధికారముసు తిరస్కారము చేసి క్రైస్త
వమతములో సంస్కారమును బోధింప సాగెను. క్రైస్తవ వేద
మగుబైబిలును జర్మను భాషలోనికి తర్జుమా చేసెను. అదివరకు
దానిని లాటిన్ భాషలోనే ఉంచవలెననియు, ప్రజలు చదువు.
టకు హక్కు లేదనియు నను నమ్మికలు వ్యాపించియుండెను. మత
గురువులు మాత్రమే చదివి ప్రజలకు నర్థమును, వ్యాఖ్యాన
మును చెప్పుచుండిరి. లూథరు బైబిలును ప్రజలభాష
లోనికి మార్చి ప్రతివారుసు దానిని స్వయముగా చదువు
కొనవచ్చునని ప్రకటించెను. జర్మసుప్రజలు విదేశీయులగు
పోపుల యొక్క అధికారమును తోసి వేసి తమ యిచ్చవచ్చిన
యోగ్యతగలగురువుల నెన్నుకొనవ లెసని బోధించెను. గురు
వులు వివాహమాడవచ్చునని శాసించెను. బైబిలులోనున్న
వాఖ్యములే ప్రమాణములుగాని పోవులు వ్రాసినగంథము
లును, వారు జారీ చేసినయుత్తరువులును ప్రమాణములు కావని
చెప్పెను, విగ్రహారాధన బైబిలుకు వ్యతిరేక మని ఖండించెను.
ఈ బోధలు జర్మనీలో దేశాభిమానముసు. స్వాతం త్వేచ్ఛను
పురిగొలిపెను,మూఢవిశ్వాసములను బంధనములను తెంచి వైచి
ఆత్మస్వాతంత్యమును స్థాపించెను. అనేకులు మార్టీన్ లూథరు
యొక్క ప్రొ సెంటుమతమును స్వీకరించుచువచ్చిరి. ఆవుడు
జర్మను రాష్ట్రములను నిరంకుశముగ పాలించుచున్న అయిదవ
చార్లెసుచక్రవర్తి కీనూతన మత సంస్కరణమును, స్వతంత్ర
భావవ్యాపకమును కంటకముగ నుండెను, మార్టిన్ లూథరును
చంప యత్నించెను. లూథరు చాలకాలము తన స్నేహితులగు