పుట:Ecchini-Kumari1919.pdf/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 17

95


వేరొక గతి లేక పోవుట చే నాతనిఁ గొల్చుచుంటిమి గాని యను రాగమునఁ గాదు. నీవు మమ్మింతగా నాదరించుచుండ నిది కాదని శత్రువుని జేరి జీవించుటకు మే మంత యవి వేకు లమా' యనుచుండ భీమ దేవుఁ డతనిఁ జూచి 'సోదరా! మీరు సంకోచమును విడిచి యిచ్చటికి రండు' ఈ యుద్ధా నంతరమున మీకు గొప్ప పదవులనుగూడ నిచ్చెద' నని చెప్పి సంత సింపఁ జేసి యతనిని లోనికిఁ గొని తగిన యుప చారములు చేయుటకు సేవకులను నియమించి మరలివచ్చి యమర సింహునితో నిట్లు ప్రసంగించెను.

భీ: -అమర సింహా ! వీరు దేశమును విడిచిపోయి నందు కానందించుచుండ నీవు వీరిని మరలఁ దెచ్చి పెట్టు చున్నావు "జ్ఞాతిశ్చే దన లేన !” మ్మనెడి పండితో క్తిని దలంచి భయపడుచున్నాను.

అ: ప్రభూ! మీరు భయపడ నవసరము లేదు. వీరిలో నసహాయశూరులగు ప్రతాపారిసింహులు మరణించి నారుగదా ! వా రుండిన చో మీరు భయపడుట న్యాయమే! కాని, వీరివిషయమై ఈ రింత చింతింపవలదు. మన మెట్లు చెప్పిన వీరట్లే నడతురు. పృథ్వీరాజు నాశ్రయించి యున్న వీరివలన మన కార్యము సులభముగా, 'నెఱు వేఱు నని యట్లు తలంచితిని, నీ రెప్పుడు పృథ్వీరాజు చెంత నుందురు గాన నచ్చట రహస్యములన్నియు మనకు సులభముగా దెలియును. మఱియు సమయముచిక్కినప్పుడు పృథ్వీ రాజును