పుట:Ecchini-Kumari1919.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

ఇచ్చినీ కు మారి


నాతోఁ జేరి సుఖంపుఁడు. మన వంశమునకు సంభవించిస యాకళంకమును దుడిచి వేయుఁడు. మనమందఱ మేక మై శత్రువుల జయించిన మన కెంతకీ ర్తి సంభవించును! మన వంశమున కెంత ప్రతిష్ఠ వచ్చును ! మన శౌర్యాదు లెంత రాణించును ! నా కిప్పుడు పృథ్వీరాజుతో గొప్ప యుద్ధము సంభవింప నున్నది. మీరిప్పుడైన నాపక్షము జేరి యాత నితో యుద్ధము చేసి రణరంగమున నతనిఁ జంపి మీ సోదరు లనుజంపిన పగను సాధించుకొనుఁడు. తమ్ముఁడా! నిజముగాఁ జెప్పుచున్నాను సుమా! కరుణరా జన్యాయముగా మన ప్రతాపారిసింహులను జంపినట్టు 'విన్నప్పుడు నేను జెందిన విచారమునకు మేర యే లేదు. అది విని సహింప లేక యీ యమరసింహుని మీ చెంతకుఁ బంపించితిని.కావున, మీరు నాయందున్న ద్వేషబుద్ధిని విడిచి నన్నుఁ జేరి నాళానందముఁ గూర్పుఁడు.' అని పలుక (గా నామాటలు విని గోకులదాసు మిక్కిలి .యానందించి భీమ దేవునియం దీపాటి మంచిగుణ ములుఁగూడ నున్న వియా యని యనుకొని 'అన్నయ్యా ! నీవు మా కాశ్రయ మిచ్చిన చో నిఁకఁ గావలసిన దేమి ! పర రాజుల నేల యాశ్రయింతుము? అతని సేవించుటకు మాకుఁగూడఁ జిన్నతము లేక పోలేదు. నిఖిల రాజుల కవమాన కరముగాఁ 'జోహన వంశజులఁ బొగడుచున్నప్పుడెల్ల మా మనస్సు పరితాపమును బొందక పో లేదు, ఆపరితాపమును సహింప లేక యేక దా మన. ప్రతాపుఁ డట్లు గావించెను!