పుట:Ecchini-Kumari1919.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

ఇచ్చనీ కు మారి



మరలఁ బ్రయాణము సాగింతము' అని పలుక మొదటివా డందుల కంగీకరింపక కార్యావసరమునుబట్టి తాను మార్గ మధ్యమునఁ కాలముపుచ్చవీలు లేదనియు, రెండన బాటసారి వెనుకకుఁ జిక్కినను దనప్రయాణము తాను మానననియుఁ జెప్పెను. కాని, రెండన వాఁడు సమీప గ్రామమున నుండు టకు నిశ్చయించి యచటి కేగుచున్నప్పుడు మాత్రము మొదటివాఁడు కూడఁ దా ననుకొన్నట్లు చేయక వాని ననుస రిరపక పోలేదు. ఆ చీకటిలో నాగాఢారణ్యములోఁ బడి వాఁడు మాత్రము పోఁగల్గునా ! రెండవవాని సాయ మున్న చో వాఁడు జంకకపోవును. కాని, వాఁడు పెడదారిఁ దొక్కు టచే మొదటివాఁడు గూడఁ జేయునది లేక యారాత్రి యచట నిలిచి పోయెను. రెండవ వాఁడు మొదటి వానిని వెంటఁ బెట్టు కొని తనమిత్రునియింటికిఁ బోయెను. ఆమిత్రుఁ డతని నెక్కు డుగా నాదరించి యాయిరువురకును నతిథిసత్కారము చేసి పండు కొనుటకు వేఱు వేఱు శయ్యల నమర్చెను. బాటసారు లిర్వురును నిదించిరి. ఆగృహస్థుఁడుగూడ మిత్రునితో గొంత సేపు సంభాషించి నిద్రించెను. రెండవ బాటసారి నిశీథ సమయమున లేచి గాఢముగా నిద్రపోవుచున్న మొదటి బాట సారియొద్దకుఁ బోయి వానిమూటలోనున్న యుత్త రమును మెల్లగా సంగ్రహించి తనమిత్రుని మేల్కొలిపి ఓయీ ! ఈ బాటసాగి 'నాకు శతకోటిలోనివాఁడు. నే నెందుల కై తిరుగుచున్నానో యా కార్యము నెఱ వేఱినది. నేనును, వీడును