పుట:Ecchini-Kumari1919.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

ఇచ్చినీ కుమారి


మఱలి తనపురమున నడుగు పెట్టియుఁ బెట్టకమునుపే యెవరో దుర్వార్త యాతని చెవిని వేసిరి. ఇది విని యతఁడు పిడు గడఁచినట్లు క్రిందఁ గూలఁబడియు నట నుండుటకుఁ దోఁచక నెంట నే కన్యాంతఃపురమునకుఁ బోయెను. అచట నావృత్తాంత మంతయును విని ధైర్యమును విడిచి బోరున నేడ్వఁదొడం గెను. ఇచ్ఛినియం దాతనికిఁ గల ప్రేమ నిరవధిక మైనది. ఆపిల్ల చిన్న తనమం దే యతఁడు భార్యావియోగము నొందినను మాఱువివాహము చేసికొనక యామెను జూచుకొని యే జీవించుచుండెను. ఆబాలిక యుఁ జదువు చేతను, దెలివి తేటల చేతను దండ్రి మనమును బూర్తిగా లోఁ బఱుచుకొని యతని ప్రేమ కళాస్థాన మయ్యెను. అట్టి గుణవంతురాలును, బ్రాణా ధిక యు సగు కుమారి యాక స్మికము గనఁబడ లేదని విన్నప్పు డా రాజుమన స్సెంత కలఁతఁ జెందెనో యెవరు చెప్పఁ గలరు ? అతఁడు కొంత సేపు దుఃఖమున మునిఁగియుండి యెట్ట కేలకు, ధైర్యమవలంబించి దాసీజనమును బిలిచి యాసమా చారమంతయు నడిగెను. తొలినాఁడు జాము రాత్రివజకు నా మెయు, రూపవతియు మాటాడుచు సంతఃపురమున నున్నా రనియుఁ దరువాతివృత్తాంతము మాకుఁ దెలియ దనియుఁ జెప్పిరి. పిమ్మట నతఁ డంతఃపుర ద్వార రక్షకులను బిలిచి యడుగ వారిట్లు చెప్పిరి. 'మహాప్రభూ ! నిన్న రాత్రి జాము న్నర కడచిన పిమ్మట రూపవతి యొక సవారిని లోనికిఁ గొని పోవుచుండ నే న దేమని యడిగితిని. 'ఓయీ ! ఇదేమియును