పుట:Ecchini-Kumari1919.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రక ర ణ ము15

81


అనంతరము రాజకుమారియొద్ద నెక్కుడు చనవుగల యొక దాసీ వెళ్ళి యిచ్చిని పడకటింటి తలుపును ద్రో సెను, లోపలగడియ వేయక పోవుటచేఁ దలుపులు తెఱవఁబడెను. అంతట నాయుపతి మెల్లగా సడుగులిడుచుఁ బోయి రాజు కుమారి తల్పమును సమీపించి చూచెను. కాని, యందామె లేదు. అందుల కది యచ్చెరువంది గది నలుపక్కలను “వెదకి యామెకనఁబడకుండుటకు మిగుల విచారమును, దొట్టు పాటును గని పైకి వచ్చి రాజకుమారి యందు లేదని తెల్పెను. అంత దాసీ జనమందును దిగులునొంది హాహాకారములు చేయుచు నంతఃపురమునాలుగుమూలలందును వెదకిరి. కాని, లాభము లేకపోయెను, కొందఱు రూపవతియింటికిఁ బోయి చూచిరి. కాని, యది యింట లేదు, రూపవతియు నిచ్ఛినియుఁ గలసి యెచ్చటికో పోయియుందురని వారనుకొనిరి. ఇంతలో నావార్త పురమందంతటను బాగుటచే జనులు గుంపులుగట్టి యంతఃపురమునకు రాఁదొడంగిరి. చళుక సింహుఁ డౌవార విని దుఃఖతుఁడై పర్వుపర్వున(బోయి దాసీజనమును బిలిచి నానావిధములఁ బ్రశ్నించుచుండెను.

భీమ దేవుని సం దేశహరునిఁ దిరస్కరించి పంపి వేసినది 'మొదలు యుద్ధప్రయత్నములు చేయుచున్న వాఁ డగుటచే జై తుఁ డొకసాఁడైన నింటి పట్టున లేఁడు. రాజపుత్రులసాయ మును గోరుటకై గ్రామాంతరములకు బోవుచుండెను, కావునఁ, దొలినాఁడే యెచ్చటికో పోయిన జై తపరమారుఁడు