పుట:Ecchini-Kumari1919.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

ఇచ్చనీ కు మారి


యింకను మేల్కొనలేదు. నాఁ డెందు చేతనో రూపవతిగూడఁ బైని గన్పట్టక పోవుట చే నా మెయు నాకుమారి చెంత నే నిద్రించి యుండు నని తలంచుచుండిరి. ఇంతలో నీశ్వరభ టచ్చటికి వచ్చెను. అతఁ డిచ్చినికి గురువు. ప్రస్తుతము సంస్కృత భాష నామెకు నేర్పుచుండు వాఁడు. అందుచే నతఁడు వాడుకను బట్టి సంస్కృతమును జెప్పుట కై వచ్చెను. అతనిఁ జూచి దాసీ జనమందఱును లేచి నమస్కరించిరి. అతఁడు వారిని జూచి 'రాజకుమారి యెక్కడ?' యని యడిగెను.

దా::- ఆమె నిద్రపోవుచున్నది. ఈ:— ఇంత సేపటి దాక నిద్రించుట యేమి ! ఇట్టి దర్భ మెప్పుడును లేదే! దా: - అయ్యా ! ఈపురమునకు రానున్న కష్టములను గూర్చి తలపోయుచునామె రాత్రియందుఁ జాలవఱకు నుల్కొనియుండును. అందుచే నింక ను నిద్రించుచున్నది కాఁబోలును !

ఈ: అగుఁగాక! సూర్యుఁ డుదయించి యిప్పటికీ నాల్గయిదు గడియలు కానచ్చినది. ఇంకను నిద్రించుట యేమి? పోయి మేల్కొలుపుఁడు.

డా: -ఆమే యాగ్రహించు నేమో ?

ఈ: మీ కాభయము వలదు. ఆమెకు సమాధాన మును నేను జెప్పెదను గాదా !