పుట:Ecchini-Kumari1919.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

ఇచ్చనీ కుమారి


రాజమండలమున కెల్ల మిక్కిలి యవమానకర మగునా వర్ణన మును విని సహింప లేక పోయెను. దుస్సహ మగు కోప మతని మనస్సున నావరించెను. ఆకోపలక్షణములు పై వారి కగపడ కుండునట్లు చేయన లెనని యతఁడు ప్రయత్నించెను. కాని, యతనికి శక్తి లేకపోయెను. తక్కిన వారికివలె నా కట్టి ప్రతా పనిముఖమందు వికాస మంకురింప లేదు. అతని చూపులు సంతోషమును వెలి పుచ్చ లేదు. ముఖమందు వ్యాపించిన క్రోధాగ్ని జ్వాలలకు ధూమ రేఖవ లె నున్న మీసముతో నతని కుడి చేయి మంతనమాడుచుండెను. ప్రతాపసింహుని వికార లక్షణములను గనిపట్టి కరుణ రాజు మిగులం గోపోద్దీపితుఁడై సింగ పుఁగోదమవ లె నాతని పై లంఘించి 'ఓరీ, దురాత్మా! మాచోహన వంశజులగుణములను వినుటకు నీ కంత కష్టముగా నున్నదా ? నిన్నుఁ బోషించు ప్రభువర్ణనము విని యానందించు టకు మాఱుగాఁ బొగచూరిన మోముతో నిటు కటకటం బడ నేల ? చోహనులప్రతాప మెట్టిదో రుచిచూచెదవు ? పిడుగువంటి యీకత్తి దెబ్బను గాచుకొను' మని కత్తి మీఁది "కెత్తెను. అడివఱుకే మండుచున్న క్రోధాగ్ని కాకరుణ రాజు వచనములు నేతిధారలు కాగా నాప్రతాపుడు చటాలునః గత్తి దూసి యతని నెదుర్కొ నెను. వా రిరువురును బోరు చుండిరి. అది చూచి సభ్యులందరును నివ్వెర పడి చూడ సాగిరి. పృథ్వీరాజు గూడ నేమి చేయుటకును దోఁపక సింహాస నమునఁ గూలఁబడెను. కొన్ని నిమిషములలోఁ బ్రతాపుఁడు కరుణ రాజుఖడ్గమున కెర యయ్యెను.