పుట:Ecchini-Kumari1919.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రక ర ణ ము 12

63


బై రాగి వచ్చినాఁడఁట. అతఁడు త్రికాలజ్ఞుఁడఁట. అడిగిన ప్రశ్నములకుఁ దగిన సమాధానములు చెప్పునఁట. అభయ సింగు నాతోఁ జెప్పినవాడు. అంతటి మహానుభావుడు లోక మందు వేఱొకఁ డుండఁడఁట. మనకు రాఁబోవు నాపదను గుఱించి యతని నడిగి తెలిసికొనుట మంచిదని నాయభిప్రాయము. అతఁ డిట నెన్నో దినము లుండఁడఁట. కనుక , మన మీరాత్రియే పోయివచ్చుట మంచిది.

ఇచ్ఛి: – ఈ రాత్రియే ! మాతండ్రిగారు గ్రామాంతరము వెళ్ళియున్నారు. ఆయన వచ్చిన పిమ్మట వారియాజ్ఞను బొంది వెళ్ళఁగూడదా !

రూప:— అమ్మా! అట్లు కాదు, మీ కేవిధమైన భయమును లేకుండ మిమ్ము రక్షించుభారము నాది.ఈదినమైన చో బై రాగిదర్శనముగూడ మనకు లభించును. లేని చో నది యసంభవము.

ఇచ్ఛి:—-పోనిమ్ము, అట్లే పోవుదము. అందులకుఁ దగిన ప్రయత్నములు చేయుము. ఇచ్ఛిని మొదట జన కాజ్ఞను బొందకుండ స్వామిదర్శనార్థముబోవ నిష్టపడ లేదు. కాని, తనకు సమీపబంధు వగు నభయసింగు తమకు రక్షకుఁడుగా వచ్చుచుండుట చే వేరొక ప్రమాదము సంభవింపదన్న నమ్మకముండుట చేతను, మఱి యొకప్పుడైన బై రాగిదర్శనము లభింపదన్న హేతువు చేతను రూపవతి చెప్పిన చొప్పున నీశ్వరునిసందర్శింపఁబోవ సమకట్టెను.