60
ఇచ్చనీకుమారి
రూప:: -- అమ్మా ! ఈయపాయమును నిముసములోమాయము చేయవచ్చును; నావిన్నప మాలకింపుము. భీమదేవుని బెండ్లాడుము, అతఁ డందమున నేమి, చందమున నేమి,
సంపదలం దేమి, రాజ్య వైభవమం దేమి సుంతై నను గొఱఁతలేనివాఁడు; నేనెంత చెప్పినను నావచన మాలోచింపకున్నావు.తల్లీ ! వేఱాలోచనము మాని, భీముని వరించి ఘూర్జర రాజ్య
మేలికొమ్ము. నీతండ్రిని, నీయాబూగడ రాజ్యమును సుఖపడనిమ్ము.
ఇచ్చి: – రూపవతీ ! నీవన్నది బాగుగా నున్నది. కానీ,యాభీమ రాజు నీకంటి కగ పడినట్లు నాకంటి కగపడ లేదు.అట్లయినఁ దప్పక యతని వరించియే యుందును. ఇక నా ప్రసంగము నాయొద్దఁ దేవద్దు. అతని పేరైనను వినుటకు నాకిష్టము లేదు,
రూప: పోనిమ్ము; ఆపదను దరించుట కుపాయముచెప్పితిని. అంతియ కొని వేఱు గాదు.
ఇచ్చి: – అంతకుఁదప్ప నాపదను దరింప నుపాయము లేదా?
రూప: ఏమున్నది
ఇచ్ఛి: – భీమ రాజును జయింపఁజాలిన యొక రాజేంద్రునిసాయ మపేక్షించిన నీయపాయము తొలఁగిపోదా ?
రూప: - అట్టివాఁ డెవ్వఁ డున్నాఁడు ?
ఇచ్ఛి: ఏమి, ఢిల్లీ శ్వరుఁడు లేడా ?
రూప: —చిఱునవ్వు నవ్వి యూరకుండును.