పుట:Ecchini-Kumari1919.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 12

59


కిప్పట్టున నతనిసాయము నడయుట.ముఖ్యము. మాయుపాధ్యాయులవారి నందులకై పంపెదను” అని యీవిధమున నాలోచించుకొనుచు నిచ్ఛినీకుమారి యతికష్టముతోఁ గాలముపుచ్చు చుండెను.మానవులు సౌఖ్యము లనుభవించుచున్నంత కాలమునుభగవంతుని స్మరింపరు. తానో, తనయాత్మ బంధువులోదుస్సహ రోగ పీడితులై మంచముబట్టి మందులవలన నుపయో గముగానక యమలోకమునుజూడ సిద్ధపడియున్నపుడు దేవుని స్మరించుకొందురు. ముడుపులు గట్టుదురు. దేవతలకుఁ గోడిపుంజులనో, గొఱ్ఱపోతులనో మొక్కుకొందురు. ఇట్లు చేయుట లోక స్వభావము. ఆ బూగడమునకుఁ దనమూలమునఁ దీఱని యాపదరా నుండుట కనిపట్టి యిచ్ఛినీకుమారి యచ లేశ్వరునిదర్శనము గావించుకొని తదీయానుగ్రహమును సంపా దించి తమ్మాయాపదనుండి తప్పించుకొన నూహించెను.ఆమె యిట్లాలోచించుచున్న సమయమున రూపవతి యచ్చటికి వచ్చి సమీపమునఁ గూర్చుండి 'అమ్మా! ఏదో యోజించుచున్నట్లున్నది; అది 'యేదో మీహితురాల నగు నాకుఁ దెలుప రాదా?' అని యడిగెను.


ఇచ్ఛి: – చెలియా ! రాఁబోవునాపదను దప్పించుకొనుట యెట్లోయన్న యోజనము తప్ప నాకు మఱియొకటియేమున్నది ?