పుట:Ecchini-Kumari1919.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

ఇచ్చనీకుమారి


ఎంతపని చేసినారు. అంతకంటే ముష్టి యెత్తుకొని జీవింప రాదా! ఇంకను వార్త లేమి ?

చారు: దేవా! పృద్వీరాజు గొప్పసై న్యమును గూర్చుచున్నాడు. తండ్రిని జంపిన తమపై బగ సాధించుకొన మిగులఁ ద్వరపడు చున్నాఁడు. స్వల్ప కాలములో నే మన దేశ ముపై డాడి నెడలివచ్చునట్లు తోచు చున్నది.

భీమ: మంచిది, నీ విక: బొమ్ము. అని వానిని బంపి వేసి 'ఈవార్త మిగుల భయంకరమైనదియే! అజ్మీరు రాజ్యము డిల్లీతోఁ గలయుటచేఁ బృద్వీరాజు రాజ్యము ప్రబలమై మా వంటి వారికి హృదయ శల్యమగుచున్నది. దాని బలమును గొంత యణంచినఁగాని మావంటివారికి సౌఖ్యము గలుగదు. నే సందులకై తగిన ప్రయత్నము చేసెదను' అని యాలోచించు కొనుచుండ సమర సింహుఁడు వచ్చి నమస్కరించి యాబూ గడ వృత్తాంతము నంతయును విన్నవించెను. అది విన్న తోడనే భీమ దేవునకుఁ గామాగ్నితోపాటు క్రోధాగ్ని కూడఁ బ్రబలి మండఁజొచ్చెను. హృదయమునం దున్న క్రోధాగ్ని జ్వాలలు మీఁది కెయుట చేఁ గంది వోయిన యతని ముఖమును, నేత్రములును మిక్కిలి జేవురిం చెను. బొమముడి చే నతనిలలాటము కడు భయంకరముగా నుండెను. అతఁ డమరసింహునిఁ జూసి 'ఆ! ఏమీ ! పరమారుఁ డేమనెను. జై నమత సంబంధము చే నేను చెడి పోయితి ననియా ! నావంశము మలిన మయినదనియా ! ఇట్లు