పుట:Ecchini-Kumari1919.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రక ర ణ ము 10

51


నిర్భయముగాఁ బల్కిన యాజై తునినాలుక నీఖడ్గముచే తుత్తునియలు చేయనలదా ? ఏమీ ! భీముఁ డాతనికంటి కొక నలుసు వలె గన్పడుచుండెను గాఁబోలు! భీముని యాటోప మతికి మఱవునకు వచ్చెనా ? ప్రళయకాల మునివంటి యీ భీముని కోపమునకుఁ బాత్రుడగు నీయపా త్రునిఁ బరమారు నెవ్వరు రక్షింతురో చూచెదనుగాక ! నాప్రచండ సైన్యము లనుసముద్రముచేఁ జుట్టంబడి యాయుధహతులనెడి తరంగముల దెబ్బలుదినుచు నడుగంటుటకుసిద్ద ముగానున్న యీ యాబూదుర్గమ నెడినౌక నెవ్వఁ డుద్ధరించునో చూతము. తనవంటివాఁ డెంత ప్రయత్నము చేసినను దుర్లభమగు నాసంబంధము సులభముగా లభించినందుకు సంతసించుటకు మాఱుగా నాచురాత్ముఁడు దోషారోపణము చేసి నిరసించెనా ! ఇందులకుఁ దగినదుష్ఫలమును జై తుఁడు :స్వల్ప కాలములో నే పొందగలఁడు. ఆరాజకుమారి పృద్వీ రాజు నే వరించునా ? నన్నుఁ గాదని యామె యా రాజాధము నెటు వరించునో కనుఁగొందము. పరమారుఁడు నాసంబంధ మున కేల యియ్యకొనఁడో, యాయిచ్ఛిని నా కేల భార్య గాదో చూతము ! అమర సింహా ! ఇక నాలస్య మేల ! మంత్ర్లను బిలువనంపుము. దిగ్గజముల చెవులు చెవుడుపడ మనరణ భేతుల మ్రోయింపుమనుము.

మన సేనా నాయకులను వేగిరింపుము. స్వల్ప కాలములోనే మన చతురంగబలములు కాళ్ళ తొక్కుళ్ళచే భూతల

.