పుట:Ecchini-Kumari1919.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రక ర ణ ము 10

49


కామమును ని గహించునో వాడే లోకములో సుఖవంతుఁ డగును. లేని - వాజన్మము దుఃఖభోజనమే

భీమ దేవు:డిచ్చి నీకుమారి సౌందర్యాదులు రూమెను వరింపన లెనన్న కోర్కికి లోబడి పలుపాల్లు పడఁ జొచ్చెను. అబూగడమున కరిగిన యమర సింహుఁ దెప్పుడు వచ్చునో, ఇచ్ఛిని దన్ను వరింపనున్న దన్న శుభవార్త యెప్పుడు దన చెవిని వేయునో యని కాసుకొని యుండెను,

ఒక నాఁ డొకచారుఁడు వచ్చి నమస్కరించి చేతులు జోడించి నిలువఁబడెను. భీమదేవుఁ డతనిఁ జూచి 'ఓరీ ! నీ వెనఁడవు ! ఎక్కడికిఁ బోయివచ్చితివి ? ' అని యడిగెను.

చారు: దేవా ! తమపినతండ్రికుమారులు ప్రతాప సింహాదు లెచ్చటికిఁ బోయిరో తెలిసికొని రానలయు నని నా కాజ్ఞాపించినారు. దేవర యాజ్ఞ చొప్పున నానృత్తాంత మరసివచ్చితిని.

భీమ: వార్త లేమి ? చారు: .మహాప్రభూ ! ప్రతాపసింహాదులు ఢిల్లీశ్వరు నాశ్రయించి యున్నారు. ఆమహారాజు వారి నెక్కుడుగా నాదరించుచున్నాడు.

భీమ: _చీ ! తుచ్ఛులు, తుచ్ఛులు. చాళుక్యవంశ సంభవులగువారు తమవంశమునకుఁ బరమశత్రువగు చోహన వంగజుని పృథ్వీరాజు నాశ్రయించినారా ? దురాత్ములు మా వంశమున కప్రతిష్టఁ గల్గించిరి. చీ ! చీ ! అధమాధములు, ,