పుట:Ecchini-Kumari1919.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రక ర ణ ము -29

173



డాలోచించి భూమిని దవ్వి ద్వారము చేసికొనుట యే మంచి దని నిశ్చయించి ఖడ్గముతో భూమిని ద్రవ్వఁ జొచ్చెను. అది యిసుక నేల యగుట చే నతఁడు విశేషము శ్రమపడకుండఁ గనే భూమికి నాబల్ల లకును నడుమ మనుష్యుఁడు దూఱి పోవు నంతటిరంధము చేయఁగలిగెను. ఆ రాజవీగుఁడు లోనికిం బోవ నారంధ్రములోఁ దూఱెను. వాఁడిట్లు లోపలికిఁ బోవు చున్న సమయమున రెండు ప్రక్కలనుండి రెండు కత్తి దెబ్బలు తగిలి వానిశిరము భిన్న మయ్యెను. వాడు కిక్కురుమనకుండఁ జ చ్చెను. గుడారములో నెవ్వరో యిర్వురు వీరు లుండి యీ కార్యము నాచరించినట్లు తోచుచున్నది. ఆయిర్వురు వీరు లును, వాని మొండెమును లోని కీడ్చి వేసి యూద్వారము చెంత నట్లె కాచుకొనియుండిరి. అంతట మఱియొక పురుషుఁ డా ద్వారమునఁబడి లోనికి రాఁబోయెను. వాఁడును లోనికిఁ వచ్చియు రానిసమయమందే యీ వీరులు వానిశిరమును ఖం డించిరి, తక్కిన మువ్వురు వీరులుగూడం గ్రమముగా నచటకు వచ్చి తమవారు తమనిమిత్తము గుడారమునఁ గాచియుందు రన్న తలంపుతో లోకిఁ బోవ సమకట్టి లోపలివీరులచే హతులై “శతాంఛారి కూపం ప్రవిశంతి" యను పండితోక్తిని సార్థకము గావించిరి. ఇట్లా యైదుగురును జంపఁబడిన తరువాత నావీరులు మికొంత సే పచ్చట వేచియుండిరి. మఱి యెవ్వరై నను వత్తు రేమో యని వారితలంపు. కాని, యెవ్వరును రా లేదు. అంత వారిలో నొకఁడు రెండవవానితో "అయ్యా ! ఈ రాజద్రోహు, లంతమందినారు. పై నిఁక నెవ్వరైన నున్నా "రేమో చూచివ చ్చెదను. మా రిందు జాగరూకులయి యుండి యీమార్గమున నెవ్వరైనను వచ్చినచో సంహరింపుఁ" డని