పుట:Ecchini-Kumari1919.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

ఇచ్చినీ కుమారి


పల్కి యాద్వారమునఁ బడి యావలకుఁ బోయెను. అతఁ డటు సేనాని వేశమును దాఁటి పోయెను. అతని కాచీకటిలో నెవ్వరు గనఁబడ లేదు. శత్రువు లిక నెవ్వరును నట లేరని - తలంచి సేనాని వేశమును జుట్టివచ్చుచుండ నొకఁ డతని కెదు రుగాఁ బోయి ఓబూ ! ఏమయినది ? మన కార్యము నెర వేరినదా ? లేదా ? పృద్వీరాజును మన వారు జంపినారా ? లేదా ? నీ వెందుల కిట్లు నచ్చితివి ! నాయున్న ప్రదేశమును గుఱుతింప లేక వేఱొక స్థలమునకుఁ బోవుచున్నట్లు గ్రహించి నానిమిత్త మే నీవు వచ్చియుందు వని తలంచి యిటు పర్విడి వచ్చి తిని, ఏమయినది ? మన కార్యము నెఱ వేఱిన దా ? లేదా? ముందామాట చెప్పుము” అని యాపురుషుఁ డావచ్చువాఁడు తనవాడే యనుకొని యాతురతతోఁ బ్రత్యుత్తరమున కెదురు చూడక యిట్లు ప్రశ్నింపజొచ్చెను. ఈవీరుఁ డాతని ప్రసంగము ముగియులోపునఁ గత్తిని మెల్లగా నంకించుకొని యొక్క వేటున నతని నఱికి 'దురా త్మా ! చావుము. మా వంటి సాధువుల నన్యాయముగా బాధించిన పాపమూరక పోవునా' అని పల్కి యచ్చోటు గదలి పో యెను.

ము ప్ప ద వప్రకరణము

పరిసమాప్తి,

మరు నాఁ డుదయమునఁ బృథ్వీరా రాజు తనగుడారము నకు వచ్చి చూచెను.అది శవములతో నిండియుండెను. అతఁడు వారిని బరిశీలించి చూచి వారు త న్నాశ్రయింపవచ్చిన చాళుక్యులని నిశ్చయించి మిక్కిలి విచారింపఁ జొచ్చెను. తన పినతండ్రి వారితో నిదివఱకు ద్వేషముపూనియుం డెను గాన