పుట:Ecchini-Kumari1919.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

ఇచ్చినీ కుమారి


రాజమన వచ్చి కరుణ రాజు నెచ్చటకో తీసికొనిపోయినారు. అతఁడు మరలివచ్చినట్లు లేదు. నేఁడు పృథ్వీరాజును జంపుట 'మన కనుకూల సమయము, మేము పోయి ప్రయత్నింతుము. నీ విచ్చట నుండుము.

పు: సంతోషమే ! పోయిరండు. సాధ్యమైనంతవఱకు బంధించి ప్రాణములతోఁ గొనివచ్చుటకే ప్రయత్నింపుఁడు,

రా: మన మండఱ మొక్కమాటు పోరాదు. ఒక్కర నే పోయి రాజుగుడారమును బ్రవేశింపవలెను. గుడారము వెనుక భాగమునుండి దారి చేసికొని పోవుట మేలు. ఎవరైన నడిగిన చోఁ బృశ్వీ రాజు నాజ్ఞ చొప్పున గస్తు తిరుగు చున్నా మని నిర్భయముగాఁ జెప్పుఁడు. నేను ముందుగాఁ బోయెదను. నే నచ్చటికిఁ జేరుదు ననఁగా మీలో నొకఁడు వచ్చుఁగాక . ఇట్లే యందఱును రండు. ఆ రాజును బంధించి తెచ్చుటయో లేక చంపుటయో యప్పటి స్థితిగతులఁబట్టి యాలోచించుకొందము.”

అని యుపాయము చెప్పి యొక వీరుడు వారి నందు లకు సమ్మతింపఁ జేసి యటనుండి బయలు వెడలి పృథ్వీరాజు గుడారమునకు వచ్చుచుండెను.

ఆగుడారము మిగులఁ బెద్దది. రాజభననమువ లె నానాలంకారశోభితమై యది యొప్పులు గులుకుచుండెను. ఆ రాజవీరుఁడు గుడారము వెనుక భాగమునకు మెల్ల మెల్లగా వచ్చి తాను లోపలికరుగుటకుఁ దగిన ద్వారము , చేయనారంభించెను. కాని, యది యసాధ్యముగాఁ జూప ట్టెను. ఆపట భవనమునకు నిలువెత్తు గలబల్ల లు చుట్టును గోడవ లె నమర్చ బడియుండుటచే దానిని భేదించుట యసాధ్యమయ్యెను. అతఁ