పుట:Ecchini-Kumari1919.pdf/166

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రక రణము. 28

165


పొమ్ము' అని యతనిఁ బంపి వేసి చటాలున నచ్చోటు గదలి పోయెను.

ఇరు వ ది యె ని మి ద వ ప్రకరణ ము

యుద్ధము

చాళుక్య భీమునకు 'భోలా భీముఁ డను పేరు గల దని యిదినఱకు వ్రాసితిని. అనఁగా వెర్రి భీముఁ డని దాని యర్థము, ఇతర కాలములం దావెర్రితనము చూపట్టదు. కాని, కోపము వచ్చినపుడు మాత్ర మది యతనిచర్యలందుఁ బూర్తి గాఁ బ్రతి ఫలించును. పృథ్వీరా జన్నను, బరమారుఁ డన్నను భీమ 'దేవుఁడు మండిపడుచుండును. అందులో వా రిరువురును దన పై కి దాడి వెడలి వచ్చి తన రాజ్యపు టెల్లయందు విడిసియున్నా రని విన్నపు డతని కెంతకోపముదయించునో చెప్పవలెనా ? అయినను ఇచ్ఛినీకుమారిని స్వాధీనము గావించుకొను యత్న ములలో మునిఁగియుండుట చేత భీముఁడెట్లో సహించి యుండెను. ఇచ్చిని తన్ను మోసపుచ్చి తప్పించుకొనిపోయి నట్లు గ్రహించినపు డదివఱకే యుదయించి హృదయమను తటాకమును నిండించియున్న కోపరస మొక్కమాఱు విజృం భించెను. అప్పటి యతనిరూపమును, చర్యలను వర్ణింప నలవి కాదు. భూయాదునిచే నతఁ డట్లు వార్త పంపి వెంట నే యుద్ధ పరికరములను దాల్చి భయంకర రూపములతో సేనాని వేశము