పుట:Ecchini-Kumari1919.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

ఇచ్చనీ కుమారి


నకుఁ జోయి నిల్చెను. అదివటికే సన్నద్ధు లైయున్న యుద్ధ భటు లతనిఁజూచి జయజయనాదములు చేయుచు సమరో త్సాహమును సూచించిరి. భీముఁడు వారినిఁ జూచి చేయెత్తి పెద్ద యెలుంగుతో “ఓ వీరభటులారా ! మీరాజునకు సహా యము చేయవలసిన సమయ మింతకంటే మఱొకటి లేదు. అతి ప్రయత్నము చేసి సంపాదించుకొన్న నారత్నము సపహరించి యీపరమారుఁడును, నీపృథ్వీరాజును నా ప్రాణములను స్వస్థా నములనుండి కడలించినారు. ఆరత్నము నాకు మరల లభించినఁ గాని ప్రాణములు గుదుటఁబడవు. మీరంద జేకీభవించి సము త్సాహముతోఁ బోయి యాశత్రువును జంపి యారత్నమును గొనివచ్చి మీ ప్రభువు ప్రాణములు నిలుపుఁడు. లెండు సమర మున వెనుకంజ వేయకుఁడు. సాహసము వదలకుఁడు. ఖడ్గము లను దాల్పుఁడు. శత్రువులశిరో నాళములం దున్న నెత్తుటి చే భూ దేవికి బలియిండు. రెండు, లెండు' అని వెర్రి కేకలు వేయ నారంభిం చెను. తోడ నే రణ భేరులు మ్రోయింపఁబడెను. తదీయధ్వనులు దశ దిశలును నిండించెను. ఆధ్వనులతోఁగూడ సైనికుల పాదఘాతములచే నెగ సినధూళులు దిశాంతములవటి కును వ్యాపించెను. సముద్రము పొంగిపొరలి ప్రవహించునట్లు ఘూర్జర పై న్యములు దుర్గమును విడిచి ముందునకు నడచి పోవుచుండెను.

అది చూచి యదివఱకే కృతసన్నాహు లైన 'యాబూ సైనికులును, ఢిల్లీ సైనికులును ' వ్యూహములు పన్ను కొని