పుట:Ecchini-Kumari1919.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

ఇచ్చనీకుమారి


నకు వచ్చితిని. నేను వచ్చునప్పటి కీగదిలో దీపము వెలుఁగు చుండెను. ఆవకుళ నన్ను : జూచి 'అయ్యా ! ఈయాసనమునఁ గూర్చుండుఁడు. మారాజకుమారి యొద్దనున్న వస్తువులు గొని వచ్చెద' నని. వెడలిపోయెను. నే నాదీపపు వెలుఁగున నిందున్న చిత్రపటములను జూచుచుంటిని. ఇంతలోఁ దలుపు వేయఁ బడినట్లు చప్పుడయ్యెను. నే నాతలుపువంకఁ జూచితిని . తలుపు బంధింపఁబడెను. నేను దటాలున ద్వారమునొద్దకు బోయి పిలిచితిని. బొబ్బలు పెట్టితిని. కాని, నాయత్నమంతయు వ్యర్థ మయ్యెను. నారోదన మరణ్యరోదన మయ్యెను. ఇంతకుఁ దప్ప నా కేమియుఁ దెలియదని మనవిచేసికొనెను. భీముఁ డది విని వెనుక ముందుసంగతు లాలోచింప నాసం దేశహరుఁడు శత్రువనియు, రాజకుమారి యతనిసాయమునఁ దప్పించుకొని పోయెననియుఁ బొడకట్టెను. వెంటనే భీమ దేవుఁడు వీఁపు విఱిగి నేలఁగూలఁబడి వికృతస్వరముతో 'అయ్యో ! ఇచ్ఛినీ కుమారి పోయినది. తప్పించుకొని పోయినది. ఆహా ! ఇంక నేమున్నది! నారాజ్యలక్ష్మి పోయినది. నామనోహారిణి పోయి నది. నా కిఁక నీజీవన మేల ? ఈ రాజ్య నేల ? ఈధనసంపద లేల? ఈ సై న్యము లేల ! ఈదాసదాసీనివహ మేల! చీ ! నాకీ తుచ్ఛ దేహ మేల ?' అని పలికి వెంట నే కోపోద్దీపితుఁడై భూయాదునిఁ జూచి - 'ఓయీ ! ఇంకను నిల్చి చూతు వేల ? లెమ్ము, పొమ్ము, రణ భేరులను మొయింపుమనుము, సైన్య ములఁ గదలింప సేనానాయకులతోఁ జెప్పుము, పొమ్ము,