ప్ర క ర ణ ము 22
129
ఇచ్చి: విలునమ్ముల నిటు తెండు,
భీ: - 'ఇచ్చును."
ఇచ్ఛి: - వకుళ చే వానిని చెప్పించుకొని నిముసములో
నావింటి నెక్కిడి బాణముసంధించి 'ఓ రాజా ! ఈ బాణముతో
నీ శీరమును దెళ్ళ నేసిన నేమి చేయుదువు ! ” అనెను.
భీమ దేవుఁ డామెభీక రాకారమును జూచి ' నివ్వెఱపడి స్తంభాకృతివహించి యుండెను. అది చూచి యారాకన్నియ “ఓ రాజా! ఈ బాణమున నీశిరమును ఖండించిన నీకు దిక్కు- లేదు. అయినను, నిరాయుధుని జంపుట వీరధర్మము కాదు. మఱియు, నీవంటి దుష్టహృదయుఁడు వెంట నే మరణించుట మంచిది కాదు. కుళ్ళి కుళ్ళి చావవలయును. ఇదిగో ! బాణము సంధించితిని. దీనితోఁ గోటగోడ పై నున్న నీటెక్కెమును బడ గొట్టెదను చూడుము' అని గుఱి చూచి కొట్టెను, వెం ట నే యది తెగి నేలఁ బడెను. ఆమె యతనిఁ జూచి 'నా చాతుర్యమును గాంచితివి ! ఇఁక నన్ను విడిచి పెట్టుము' అని పలికెను,
భీముఁ డది చూచి యాశ్చర్యపడి 'ఇంత చాతుర్యము నే నెక్కడను జూడ లేదు. అమ్మయ్యో ! ఇట్టి నిన్ను విడువఁ గలనా ?' అని పల్కుచు నచ్చోటువాసి చ నెను.