పంచమాశ్వాసము
171
లలుఁగు[1] మోహణముస హ స్తంబు దొడిగి
కిన్నరబ్రహ్మయ్య సెన్ను దుల్కాడఁ
బన్నగధరుమహాభక్తులఁ దలఁచి
యాయతి నభిముఖుం డై “త్రిపురాంత
కా" యని పిలుచుడు "నో" యనుచుండె,
బిట్టుల్కి మూర్ఛిల్లి [2]బిమ్మటిఁ బొంది
నెట్టోడి లింగసన్నిహితులు దక్క- 260
ఖగమృగోరగ నరకరితురగాదు
లగు సమస్తచరాచరాది జంతువులు
నుక్కఱి మ్రగ్గి యట్లున్నవి యున్న
చక్కటిఁ బ్రాణము ల్గ్రక్కున విడిచె ;
నాకటకం బిట యట కానఁబడియె;
లోకంబులెల్లఁ గల్లోలంబు నొందె ;
నీక్షితి గంపించె; వినుఁ డస్తమించె;
నక్షత్రములు డుల్లె; నగములు ద్రెళ్ళె ;
నంబుధు లింకెఁ ; గూర్మంబుఁ దలంకె ;
నంబరం బిల మ్రొగ్గె; నహిపతి స్రగ్గె; 270
ననిలుండు దొలఁగె ; స్వాహాపతి మలఁగె :
వనజనాభుఁ డులికె; వనజజుఁ డలికె;
సమసుప్తిఁ బొందించి జగములఁ ద్రుంచి
ప్రమథులు లోకముల్ దమమయంబుగను
నాడుచుఁ బాడుచు ససమానలీలఁ
గ్రీడింప మఱియు సత్క్రియ దులుకాడ
నవికలానేకభక్తావళి వేర్చి
సవిశేషగతి మహోత్సవములు సలుప
బాయక రేయును బగలును గూడ
మ్రోయంగ నేడ్దినంబులు సన్నపిదప 280
భువనోపకారార్ధబుద్ధిమై బసవఁ