పుట:Dvipada-Bagavathamu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

ద్విపదభాగవతము

పాండవులు దిగ్విజయ యాత్రకై వెడలుట
జటుల బలాఢ్యుఁడై సహదేవుఁ డెలమి
యట దక్షిణంబున కరిగె పెంపొంది;
నకులుఁడుదగ్రసైన్యము తన్ను గొలువఁ
బ్రకటితంబుగ నేఁగెఁ బడమటి కడకు;
ఘనబలోపేతుఁడై కదలి యర్జునుఁడు
ధనదు దిక్కునకు నుద్ధతవృత్తి నడచె;
సేమంబుతోడుత నెఱిఁ బూర్వదిశకు
భీమబలాఢ్యుఁడై భీముఁడుఁ గదలె;520
నీభంగిఁ జని దిక్కులెల్ల సాధించి
యాభీలరణకేళి నహితుల నోర్చి
కరిహయమాణిక్యఘన నిష్కములును
వరరత్నభూషణావలు లొప్పఁ దెచ్చి
ధర్మనందనునకుఁ దగ వేఱవేఱ
నర్మిలి నొప్పించి యనుజు లిట్లనిరి.
“జననాథ! విను జరాసంధుఁడు దక్క
మన కరి వెట్టని మహివుఁడు లేడు
వాని నిర్జింప కధ్వరకృత్యమునకుఁ
బూనఁగఁ దలఁచుట బుద్ధిగా దెందు.”
అని పల్క నుర్వీశుఁడగు ధర్మసుతునిఁ
గనుఁగొని బోధించి కంసారి పలికె.

శ్రీకృష్ణుఁడు జరాసంధుని మాయించెదనని చెప్పుట


“జననాథ! నీభుజాశ్రయశక్తి దలఁప
నెనయ జరాసంధుఁ డెంతటి వాడు?