పుట:Dvipada-Bagavathamu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగదభిరక్షకాండము

203

మల్ల యుద్ధంబున మారుతిచేత
నెల్లుండి చంపింతు నిటు జూడు మమ్ముఁ
బనుపుము నీకింత భయమంద నేల?”
అనిపల్కి భీముఁడు నర్జునుఁ డెలమి
తనుఁగొల్చి రాగ నుద్ధత గిరివ్రజము

శ్రీకృష్ణుఁడు భీమార్జునులతో బ్రాహ్మణవేషములను ధరించి గిరివ్రజము ప్రవేశించుట


దనర బ్రాహ్మణ వేషధారులై చొచ్చి530
యరులకభేద్యుఁడై యలరు మాగధుని
వర మందిరమున కవారణ నరిగి
దేవగురుద్విజ తృప్తిఁ గావించు
సావధానుని జరాసంధునిఁ గాంచి
వామనరూపమై వచ్చి యబ్బలిని
భూమి వేఁడినయట్టి బుద్ధులప్రోగు
యనిలజార్జునులతో నర్థి దీవించి
చనవున నాజరాసంధుతో ననియె.
 

శ్రీకృష్ణుఁడు జరాసంధుని యుద్ధభిక్ష వేఁడుట


“అనఘాత్మ! యీయింటి కథితులు మేము
చనుదెంచినారము సకలవస్తువులు
నడిగిన లేదన కర్థుల కిచ్చు
కడుపుణ్యనిధివి మాగధరాజతనయ!
ఏమిగోరిన యర్థ మిచ్చి నిచ్చలును
భూమిలోఁ బొగడొంది బొంకవెన్నఁడును!