పుట:Dvipada-Bagavathamu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగదభిరక్షకాండము

201

లోకరక్షణ! సితశ్లోక! లోకేశ!
నీవెఱుఁగని యవి నిఖిలంబు లందు
లేవెల్ల యెడల నిర్లేవుండ వీవ
వినుము నీ కెఱిఁగించు విన్నపమొకటి.
ఆనఘాత్మ! రాజసూయము పేరి క్రతువు
సేయుదునని మదిఁ జింతించినాఁడ
నేయుపాయంబున నిదిసిద్ధి బొందు
నానతిమ్మనుఁడు నాయమతనూభవుని
యాననంబీక్షించి హరి ప్రీతిఁ బలికె.510

శ్రీకృష్ణుఁడు రాజసూయయాగము నాచరింపవలసినదిగా ధర్మపుత్రుని ప్రోత్సహించుట


“కౌరవవృషభ! లోకము రాజులకును
యేరీతి సిద్ధింప దీమహాక్రతువు
ధరణీశ! నీవు నీతమ్ములు బలిమి
దొరకని కార్య మెందును గలదయ్య?
పితృదేవ సద్విజప్రీతి గావింపు
టతిశయమగుపుణ్య మయ్యధ్వరంబు!
రాజులఁ గెలిచి వారల ధనావళుల
రాజసంబునఁ దెచ్చి రాజసూయంబు
వెలయింపవలయు దిగ్విజయంబు సేయఁ
దలఁచిన వేగ నీ తమ్ములఁ బంపు”
మని చెప్పుటయు విని యమనందనుండు
ననుజుల దిగ్విజయార్థంబు ననుపఁ