పుట:Dvipada-Bagavathamu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

ద్విపదభాగవతము

ఆదినారాయణుఁడగు కృష్ణుఁ జూపి;
అనుమానపడి చూడ నంత ప్రద్యుమ్నుఁ
గనియీతఁడాతఁడే కాఁబోలుననుచు
మనములో శంకించి మరియనిరుద్ధుఁ
దనుకాంతి రూపంబుఁ దప్పకఁ జూచి
తలఁపులోపలి కూర్మి కట్టుముట్టాడఁ
బులకించి తిలకించి పూఁబోడి పలికె.
“కలలోనఁ గన్న చక్కని వాఁడె వీఁడు!
కలయల్ల నాకు నిక్కవమయ్యె నేఁడు!
నీ కౌసలంబును నీ దయాగుణము
నీ కూర్మి పెంపును నీవచోరతియు840
నాకంజసూతికి నలవియే పొగడ?
నాకెవ్వరికదిక్కు నలినాయతాక్షి!“
అని పల్కి యంతంత యతిశయంబైన
మనసిజానలము పైమలసి మట్టాడఁ
దన్ను దానెఱుఁగక ధర వ్రాలియున్న
యన్నాతి బోధించి యల్లననెత్తి
కన్నీరు దుడిచి యంగంబెల్ల నిమిరి
చెన్నార నెయ్యంబుఁజిలుక నిట్లనియె.

చిత్రరేఖ తన మాయచే ననిరుద్ధుని యపహరించుట


“పైదలి! నీదైన భాగ్యంబు కతన
యాదవోత్తముఁడైన హరిపౌత్రుడబ్బె!
ఆ సుందరాకారు నర్మిలిఁ దెచ్చి
నీ సమ్ముఖమువేసి నెమ్మివాటింతు.