పుట:Dvipada-Bagavathamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్యాణకాండము

139

వెఱవాయు”మనిపల్కి వెలఁది బోధించి
తెఱవ మాయాగతి దివమున కెగసి
రాజీవనేత్రి సురక్షితంబగుచు
రాజితంబైన ద్వారకకేఁగి యందు
యువిదలతోఁగూడి యుద్యానభూమిఁ
దవిలి రతిక్రీడఁ దనిసి నిద్రించు
యనిరుద్ధుఁగాంచి మాయలుఁగొల్పి యెత్తు
కొని వియద్గతి వచ్చి కోర్కులు బొదల850
బాణతనూజ తల్పము క్రేవఁబంచ

అనిరుద్ధుఁడు ఉషాకన్యతోఁ గ్రీడించుట


బాణునందను నుంచి పడుతుక చనియె.
అనిరుద్ధుఁడంత మాయానిద్రఁ దెలసి
కనువిచ్చి పరికించి కనకతల్పమునఁ
దనకు బాపకలతఁ దలయాపు సేసి
కనుమోడ్చి ముఖచంద్రకాంతులు వొలయ
జక్కవ కవఁగప్పు జలజమో యనఁగ
నొక్క కేలునను నురోజంబులదిమి
కలయఁ గంకణమణిగణమరీచికల
మలయుచు దిన ద్యుతి మాయంగఁ జేయుఁ
దనబోఁటి మాటలఁ దాపంబుఁ దీరి
మనమూరడిలి యాదమఱచి నిద్రించు
నయ్యుషాసతిఁగాంచి యంతరంగమున
నెయ్యంపురసముబ్బి నీటులు వొడమ
నందంద కనుఁగొని యంగజాస్త్రములఁ