పుట:DivyaDesaPrakasika.djvu/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"తిరుక్కోట్టియూర్ నంబి"

(గోష్ఠిపూర్ణులు)

తిరునక్షత్ర తనియన్:-
    వైశాఖ రోహిణ్యుదితం గోష్ఠిపూర్ణం సమాశ్రయే|
    చరమశ్లోక తాత్పర్యం యతిరాజాయయోపదత్||
    శమదమ గుణపూర్ణం యామునార్య ప్రసాదాత్
    అధిగత పరమార్దం జ్ఞాన భక్త్యాది సిన్దుమ్‌|
    యతిపతిసతపాదం శ్లోకతత్త్వార్ధ విష్ఠం
    శ్రితదురితహరం శ్రీ గోష్ఠిపూర్ణం నమామి||
నిత్యతనియన్:-
    శ్రీ వల్లభ పదాంభోజ ధీభక్త్య మృత సాగరమ్‌|
    శ్రీ మద్గోష్ఠిపురీ పూర్ణం దేశికేన్ద్రం భజామహే||

శ్రీ పుండరీకాంశ సంభూతులైన తిరుక్కోట్టియూర్ నంబిగారు తిరుక్కోట్టియూర్ అనుదివ్యదేశమున సర్వజిత్ నామ సంవత్సర వృషభమాసమున రోహిణీ నక్షత్రమునందవతరించిరి. వీరికి గోష్ఠిపూర్ణులనునది నామాంతరము. వీరు పూర్వశిఖులుద్రాహ్యాయన సూత్రులు. వీరి కుమారులు తెఱ్కాళ్‌వాన్, కుమార్తె దేవకీ పిరాట్టి.

వీరు శ్రీ ఆళవన్దారుల శ్రీపాదములాశ్రయించి రహస్యార్థములను అధికరించిరి. భగవద్రామానుజులు వీరి సన్నిధికి పదునెనిమిది పర్యాయములు అనువర్తించి తిరుమంత్రార్దమును, చరమశ్లోకార్దమును సేవించిరి. తాము తెలిసికొన్న తిరుమంత్రార్దమును తిరుక్కోట్టియూర్‌గోపురముపై నుండి సర్వులకు తెలియజేసిరి. వారి వరసమృద్ది ప్రియత్వమునకు సంతుష్ఠులైన గోష్ఠిపూర్ణులు వీరిని "ఎంబెరుమానార్" అనిసంబోదించిరి. తదాది భగవద్రామానుజులకు "ఎంబెరుమానార్" అనుతిరునామమేర్పడినది.

వాழி తిరునామమ్‌

<poem> అరియన్ నాళ్ రోహిణి వైయాశి వందోన్ వాழிయే

      ఆళవన్దార్ తాళిణై యిల్ అడిమై శెయ్‌వోన్ వాழிయే

పరమనవన్ తెర్‌కాழ்వాన్ పదం పణిన్దోన్ వాழிయే

      బాష్యకారర్ క్కతిరహస్యం పగరమవన్ వాழிయే

తిరుక్కోట్టియూరదనిల్ శేర్‌న్దిరుప్పోన్ వాழிయే

      తెఱెకాழ்వాన్ తమప్పనెన్ఱు తిశైమఱివోన్ వాழிయే

తిరుమాగుం తెన్‌మొழிయిన్ తిరంతెరిన్దోన్ వాழிయే

     తిరుక్కోట్టియూర్ నంబి యిరుతిరువడిగళ్ వాழிయే.

213