పుట:DivyaDesaPrakasika.djvu/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇది కరీంనగర్ జిల్లాలోనిది. నరసింహస్వామి సన్నిధి గోదావరీ నదీతీరమున గలదు. ప్రాచీన దేవాలయములలో ధర్మపురి యొకటి. ఈ క్షేత్రస్వామి విషయమై శేషప్పకవి నృసింహ శతకమును రచించెను. తుఱుష్కులవలన బాధలుపడిన శేషప్పకవి స్వామిని నిందాస్తుతి గర్బముగ స్తుతించెను.

నల్గొండ - 63

ఇదిజిల్లా కేంద్రము. ఇచటరామగిరిలో శ్రీసీతారామస్వామి సన్నిధి ఆండాళ్ సన్నిధి కలదు. శ్రీరామనవమి, ధనుర్మాసము మిక్కిలి వైభవముగా జరుగును. పలు ప్రాంతముల నుండి భక్తులు వచ్చి దర్శింతురు.

యాదగిరిగుట్ట - 64

లక్ష్మీనరసింహస్వామి సన్నిధి కొండమీద గలదు. భక్తులకు వరప్రసాది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. పలుప్రాంతముల నుండి భక్తులు వచ్చి సేవింతురు.

మార్గము: విజయవాడ రైలు మార్గంలో రాయగిరి స్టేషన్‌కు 10 కి.మీ.

నరసింహస్వామి(యాదగిరి గుట్ట)

NARASIMHA SWAMY

(YADAGIRIGUTTA)

178