పుట:DivyaDesaPrakasika.djvu/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇదిప్రాచీనమైన నగరము. పీఠికాపురియనిపేరు. ఇచట కున్తీ మాధవ స్వామి సన్నిధికలదు. దీనిని మణవాళమహామునులు ప్రతిష్ఠించినట్లు చెప్పుదురు.

పద్మనాభం, రామతీర్థం - 60

ఈరెండును విజయనగరం సమీపములోనివి. పద్మనాభస్వామి, కోదండరామస్వాముల సన్నిధులు కలవు. ప్రాచీనమైనవి. ఇచట శ్రీవైష్ణవ గోష్ఠి మిక్కుటముగా గలదు.

కాకినాడ - 61

ఇది ప్రసిద్దనగరము. తూర్పుగోదావరి జిల్లా ముఖ్యపట్టణము. ఈనగరమునకు 10 కి.మీ. దూరములోని జి.వేమవరం అనే గ్రామంలో అష్టాక్షరీ క్షేత్రము కలదు.ఇచట వేంచేసియున్న వైకుంఠనారాయణ పెరుమాళ్ అతిశయమైన సౌందర్యముతో భక్తుల హృదయాలను దోచుకొందురు. ఇచట ప్రతి నిత్యము అష్టాక్షరీ జప తర్పణ హోమాదులు జరుగును. దీని నిర్వాహకులు ఉపనిషత్ సిద్దాంతాచార్య పీఠాధిపతులు శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరంగరామానుజ జీయర్ స్వామివారు.

శ్రీ వైకుంఠ నారాయణులు

SRI VYKUNTA NARAYANULU

177