పుట:DivyaDesaPrakasika.djvu/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గూడూరు - 41

అళగనాథస్వామి-రాజ్యలక్ష్మీ త్తాయార్.

విశే: మిక్కిలి ప్రాచీనమైన సన్నిధి. పెరుమాళ్లు తిరుమాలిరుంశోలై పెరుమాళ్ల వలె వేంచేసియుందురు.

మార్గం: మద్రాసు-విజయవాడ మార్గములో గూడూరు స్టేషన్.

సింగరాయకొండ - 42

విజయవాడ-గూడూరు రైల్వేలైనులో సింగరాయకొండ రైల్వేస్టేషన్. స్టేషన్ నుండి 1 కి.మీ. దూరములో కొండగలదు. ఈకొండమీద వరాహలక్ష్మీ నరసింహస్వామి వేంచేసియున్నారు. చాలా ప్రాచీనమైన సన్నిధి. స్వామివరప్రదుడు.

కావలి - 43

ఇది మద్రాసు-విజయవాడ మార్గములో నెల్లూరు తర్వాత స్టేషన్. మిక్కిలి ప్రాచీనమైన లక్ష్మీకాంతస్వామి సన్నిధి గలదు. ఈసన్నిధిలో వేంచేసియున్న పెరుమాళ్ళు, ఉడయవరులు భక్తుల హృదయములను దోచుకొందురనుటలో అతిశయోక్తిలేదు.

ఒంగోలు - 44

ఇదిప్రకాశం జిల్లా ముఖ్య పట్టణము. రంగమన్నార్-ఆండాళ్ సన్నిధి, చక్రవర్తి తిరుమగన్ సన్నిధి కలదు. శ్రీవైష్ణవ సంప్రదాయమునకు నిలయమై విరాజిల్లుచున్నది.


166